కుమారస్వామి, కేసీఆర్ మధ్య ఏం జరిగింది ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కానీ భారత రాష్ట్ర సమితి అసలు పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర నుంచి ఎప్పుడో పాతికేళ్ల కిందట ఓ జిల్లాకు జడ్పీ చైర్మన్ గా చేశారని ఆయన కంటే ప్రముఖ నేత ఎవరూ ఉండరన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకుని వారికి కండువాలు కప్పి.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా అని ఆస్థాన పత్రికలో రాసుకుంటున్నారు. కానీ తమ తొలి టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ స్వయంగా ప్రకటించిన రాష్ట్రంపై మాత్రం కనీసం దృష్టి పెట్టడం లేదు.

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలనుకున్న తర్వాత కేసీఆర్ కు అత్యంత ఆప్తునిగా మారిన నేతలు జేడీఎస్ నేతలు. కుమారస్వామి .. ఆయన కుమారుడు పిలిచిందే తడవుగా హైదరాబాద్ వచ్చేవారు. కేటీఆర్ కుమారస్వామి కుమారునికి ఆప్యాయంగా టిఫిన్లు వడ్డించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. తాము కర్ణాటక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులు బీఆర్ఎస్ గురించే ఆలోచించడం లేదు. బీఆర్ఎస్ మద్దతు గురించే ఆలోచించడం లేదు. ఆ పార్టీకి ఎప్పట్లాగే పాతిక సీట్ల వరకూ వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ కు క్లియర్ మెజార్టీ వస్తుందని.. కింగ్ మేకర్ అయ్యే చాన్స్ లేదని ఆ సర్వేలు చెబుతున్నాయి.

దీంతో వారు మరింత కష్టపడుతున్నారు. యాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మద్దతిస్తామని బీఆర్ఎస్ ఆసక్తి చూపినా కుమారస్వామి ఆసక్తిగా లేరని చెబుతున్నారు . కేసీఆర్ ను చూస్తే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమ నేత మాత్రమేనని అలాంటి నేత తమ రాష్ట్రం కోసం పని చేస్తారంటే కన్నడ ప్రజలు నమ్మరని.. అది పార్టీకి మైనస్ అవుతుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ఆర్థిక సాయం ప్రచారం ఉన్నా… కుమారస్వామి మాత్రం బీఆర్ఎస్‌తో వీలైనంత దూరం మెయిన్ టెయిన్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close