వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు ?

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. సాక్షి తో సహా చానల్స్ అన్నీ కూడా మొదట్లో ఇది సహజమైన మరణం అని ప్రకటించడం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా ముందు సహజ మరణం అన్నట్టుగానే మాట్లాడడం, తర్వాత కొద్ది గంటలకి ఇది దారుణమైన హత్య గా పోలీసులు తేల్చడం, దాంతో వైఎస్ఆర్సిపి నేతలు కూడా ఇది హత్యేనని, దీన్ని చేసింది తెలుగుదేశం పార్టీ నేతలని వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే, అప్పట్లో ప్రతిపక్షం ఆరోపించినట్లుగా నిజంగానే ఇది తెలుగుదేశం పార్టీ పని అయి ఉంటే, జగన్ అధికారంలోకి రాగానే ఈ కేసు చిక్కుముడి వీడుతుంది అని భావించిన ప్రజలకు దాదాపు వంద రోజులైనా ఆ హత్య కేసు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 

అయితే ఇంతలో ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న శ్రీనివాస రెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. పోలీసులు తనను వేధిస్తున్న కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిన సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. దీంతో ప్రతిపక్షం అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మీద విమర్శల తీవ్రత పెంచింది. తెలుగుదేశం పార్టీ నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఈ కేసులో నిజానిజాలు బయటపడాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలిసిందిగా ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. సాక్ష్యాలు తారుమారు చేసే సంస్కృతి వైఎస్ఆర్ సీపీ నేతల దేనని, అసలు నిందితులను రక్షించడానికి శ్రీనివాస రెడ్డి లాంటి వారిని పోలీసులు వేధించడం తోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా, ప్రజాధనంతో చంద్రబాబు హయాంలో నిర్మించిన తాత్కాలిక భవనాలను సైతం కూల్చివేసిన జగన్ ప్రభుత్వం,  నిజంగా తెలుగుదేశం పార్టీ నేతల హస్తం గనక ఈ కేసులో ఉండి ఉన్నట్లయితే, ఈ వంద రోజుల కాలంలో కచ్చితంగా వారి మీద బలంగా కేసులు నమోదు చేసి ఉండేవారని, దాదాపు వంద రోజులు అయినా ఇప్పటి వరకు ఆ దిశగా కేసులు నమోదు కాలేదంటే, తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఇందులో ఉండకపోవచ్చని, మరి ఇంకేదో కారణాలు ఉన్న కారణంగానే కేసులోని నిజాలు బయటకు రావడానికి సమయం పడుతుందని ప్రజల్లో కూడా ఒక భావన ఏర్పడింది.

మరి తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేసినట్లుగా వైకాపా ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తుందా,  ఈ కేసులోని నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయా అన్నది వేచి చూడాలి. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close