ఢిల్లీలో విజయసాయిరెడ్డిని దూరం పెట్టిన బీజేపీ..!

తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను.. ఏపీకి తీసుకు వచ్చి.. ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టు ఇద్దామనుకున్నారు జగన్. స్టీఫెన్ రవీంద్ర వైఎస్ జగన్ ఫ్యాన్ అన్న ప్రచారం ఉంది. ఆయన వచ్చి అనధికారికంగా విధులు కూడా నిర్వహించారని చెప్పుకొన్నారు. ఢిల్లీ సర్కార్ తో జగన్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు.. విజయసాయిరెడ్డి లాబీయింగ్ సామర్థ్యం అన్నీ చూసి… స్టీఫెన్ డిప్యూటేషన్ లాంఛనమే అనుకున్నారు. కానీ… చివరికి కేంద్రం నిరాకరించిందనే వార్తను చూసి.. రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో.. తమకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డికి.. ప్రధానమంత్రి కార్యాలయం రెడ్ కార్పెట్ పరుస్తుందని. గొప్పలు చెబుతూ ఉంటారు.

ప్రధాని మోదీ కూడా.. ఓ సందర్భంలో.. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో … ” హల్లో..విజయ్ గారూ.. ” అంటూ విజయసాయిరెడ్డిని పలకరించి.. షేక్ హ్యాండివ్వడంతో.. తమ పలుకుబడికి ఎదురు లేదనే భావనకు వచ్చారు. అయితే.. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఓ ఐపీఎస్ అధికారిని డిప్యూటేషన్ పై .. ఏపీకి తెచ్చుకోలేకపోయారు. నాన్చి..నాన్చి.. చివరకు స్టీఫెన్ రవీంద్రకు కేంద్రం నో చెప్పింది. శ్రీలక్ష్మీ విషయం ఎటూ తేల్చకపోయినా పెండింగ్ లో పెట్టారంటే..తిరస్కరించడమేనని అంటున్నారు. కేంద్రం వద్ద చాలా పలుకుబడి ఉందనుకున్న వైసీపీ నేతలకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. చివరికి జగన్ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడమే వైసీపీని బాధిస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ప్లాన్డ్ గా … తమ వైఫల్యాల్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం ఢిల్లీ నేతల్లో ఏర్పడినట్లుగా చెబుతున్నారు. తమ వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ.. అదే చనువుతో కేంద్రంతో రుద్దే ప్రయత్నాన్ని విజయసాయిరెడ్డి చేశారు. అన్ని నిర్ణయాలను… మోడీ, షాలకు చెప్పే చేస్తున్నామని.. వారి ఆశీస్సులు ఉన్నాయన్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో.. బీజేపీలోనే గగ్గోలు రేగింది. దీంతో వైసీపీని వీలైనంత దూరంగా పెట్టాలని బీజేపీ భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఫలితమే.. జగన్ అడిగిన అధికారుల్ని ఏపీకి పంపకపోవడం అనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి కార్యాలయం కూడా.. విజయసాయిరెడ్డి అపాయింట‌్మెంట్లను.. ఖరారు చేయడం లేదని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close