రోజాకు ఉన్న పదవి పాయే..! మినిస్ట్రీ వస్తుందా..?

ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డికి పదవిని కేటాయించింది వైసీపీ నాయకత్వం. ప్రస్తుతం ఈ పదవిలో ఆర్కేరోజా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రి పదవికి రోజా పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆమెను హైకమాండ్ బుజ్జగించింది. అప్పటికప్పుడు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ప్రకటించింది. రాష్ట్ర స్థాయి పదవి కావడం.. పారిశ్రామిక పరంగా.. మంచి ప్రాధాన్యత ఉన్న పదవి కావడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆమె సంతృప్తి పడినా.. రెండున్నరేళ్ల తర్వాత జరగబోయే పూర్తి స్థాయి పునర్‌వ్యవస్థకరణలో మంత్రి పదవి దక్కుతుందని.. ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పుడు జగన్ చెప్పిన రెండున్నరేళ్ల సమయం దగ్గర పడటంతో… రోజా పదవిని మెట్టు గోవిందరెడ్డికి కేటాయించారు. రోజాకు మంత్రి పదవి వస్తుందని.. అందుకే ఉన్న పదవిని తీసేశారన్న అంచనాలో ఆమె సానుభూతిపరులు ఉన్నారు. రోజా కూడా అదే నమ్మకంతో ఉన్నారు. రోజాది రెడ్డి సామాజికవర్గం కావడంతో ఆమెకు మైనస్ అవుతోంది. చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేతగా ఉన్నారు. ఆయనను కాదని రోజాకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కానిపని. అయితే ఇటీవలి కాలంలో రాజకీయాలు మారిపోయాయి. పెద్దిరెడ్డికి.., హైకమాండ్‌తో గ్యాప్ పెరిగిందన్న ప్రచారం ఉంది.

కొన్ని కారణాల వల్ల బొత్సతో పాటు పెద్దిరెడ్డిని ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంచాలన్న ప్లాన్‌ను వైసీపీ హైకమాండ్ అమలు చేస్తోందని చెబుతున్నారు. ఈ ప్రకారం.. ఈ ఇద్దరు సీనియర్ నేతల్ని రాజ్యసభకు పంపబోతున్నారని కూడా అంటున్నారు. అదే జరిగితే.. రోజాకు చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పదవి రావడం ఖాయమని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిణామాలపై పెద్దిరెడ్డి ఎలా స్పందిస్తారు. ఆయనను వైసీపీ హైకమాండ్ ఎలా దారిలోకి తెచ్చుకుంటుంది అన్నదానిపై పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తే.. రోజాకు మరోసారి ఆశాభంగం కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close