ఏడాది కిందటితో పోలిస్తే ఇప్పుడు ఏపీలో పూర్తి స్థాయిలో పరిస్థితిలు మారిపోయాయి. ఏ రోడ్డు చూసినా ఏడాది కిందటి వరకు ఘోరంగా ఉండేది. మొత్తం ఇప్పుడు మారిపోయింది. అన్ని చోట్లా ఏడాదిలోనే మొత్తం రోడ్లు వేశారు. మొదటి నెలలోనే పెన్షన్లు పెంచారు. తొలి నెలలో ఏకంగా ఏడు వేల రూపాయలు ఇచ్చారు. తర్వాత నుంచి నాలుగు వేలు తొలి రోజునే వాలంటీర్లు లేకపోయినా ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. అన్న క్యాంటీన్లను పెట్టారు. అందరి ఆకలి తీరుస్తున్నారు. ఉచిత సిలిండర్ పథకం అమలవుతోంది. ఈ పథకం అమల్లో సమస్యలు రావడంతో బుకింగ్ తో సంబంధం లేకుండా డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. ల
ఏడాదిలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. భూసమస్యల్ని పరిష్కరించేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే తల్లికి వందనం అమలు చేయబోతున్నారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవను అమలు చేయబోతున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఎమ్మెల్యేలు నెరవేరుస్తున్నారా అంటే.. ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మేల్యేలు ప్రభుత్వం చేసిన పనిని.. సాధించిన విజయాలను పెద్దగా ప్రచారం చేయడం లేదు.
కొంత మంది ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా యువ ఎమ్మెల్యేలు ..తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయినా వారు పూర్తిగా బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. వారు పార్టీ పని తక్కువగా చేస్తున్నారు. ఇలాంటి వారిపై చంద్రబాబుకు పూర్తి సమాచారం ఉంది. నారా లోకేష్ కూడా ఆరా తీస్తున్నారు. తొలి ఏడాది ఎమ్మెల్యేలను చూసీ చూడనట్లుగా ఉన్నా.. లేక నుంచి పరుగులు పెట్టించేందుకు టీడీపీ హైకమాండ్ సన్నాహాలు చేస్తోంది.