రాజ్యసభకు యనమల: తీరనున్న చిరకాల కోర్కె

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడిని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌‍కు పంపబోతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన జైరామ్ రమేష్, జేడీ శీలం, తెలుగుదేశం తరపున ఎన్నికైన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, బీజేపీ తరపున ఎన్నికైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ఈ ఏడాది జూన్ నెలతో ముగియబోతోంది. సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్‌లను మళ్ళీ నామినేట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానంకూడా లభించకపోవటంతో జూన్ నెలలో ఖాళీ అయ్యే నాలుగింటిలో మిగిలిన రెండింటినీ టీడీపీ, వైసీపీ చెరొకటి పంచుకోనున్నాయి. ఈ ఒక్క స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడో నిర్ణయించేశారు. ఆ స్థానాన్ని యనమలకు ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. యనమలకు ఎప్పటినుంచో రాజ్యసభలో ప్రవేశించాలన్నది బలమైన కోర్కెగా ఉందట. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. అన్ని పదవులూ అనుభవించానని, ఒక్క రాజ్యసభ సభ్యత్వమొక్కటే తీరని కోర్కెగా మిగిలిందని యనమల ఎన్నోసార్లు అన్నారు. అయితే యనమల కేంద్రానికి వెళ్ళిపోతే రాష్ట్రంలో సంక్షోభ సమయాలలో అండగా ఉండే పెద్ద తలకాయను కోల్పోయినట్లవుతుందేమోనని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతానికి ఆరు పర్యాయాలనుంచి యనమల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వాలలో స్పీకర్‌గా, ఆర్థికమంత్రిగా కీలక పాత్ర పోషించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close