ప్రశాంత్ కిషోర్‌ని రంగంలోకి దింపుతున్న జగన్..!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ప్రశాంత్ కిషోర్‌ను పిలిపించారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కోసం.. పని చేస్తూ.. బీజేపీ వ్యూహాలను ఎదుర్కొనే విషయంలో మమతా బెనర్జీకి సహకరిస్తూ.. తీరిక లేకుండా ఉన్న ఆయన… ఏపీ సీఎం జగన్ కబురు పెట్టడంతో హుటాహుటిన వాలిపోయారు. ఇప్పటికీ వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా.. పీకే ఉన్నారు. ఆయన ఐ పాక్ టీం ఇప్పటికీ.. వైసీపీకి పని చేస్తూనే ఉంది. పీకే టీంలోని కొంత మందికి … ప్రభుత్వ పదవులు కూడా వచ్చాయి. అయితే.. మాస్టర్ మైండ్ పీకే… ఇప్పుడు పూర్తిగా బెంగాల్ పైనే దృష్టి పెట్టడంతో.. ఆ లోటు జగన్మోహన్ రెడ్డికి బాగా కనిపిస్తోంది.

ఇటీవలి కాలంలో మత రాజకీయాలు ఏపీలో పెరిగిపోవడం… ఆలయాలపై దాడులు ఆగకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అంతే కాదు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉందన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన నేరుగానే చెప్పారు. ఆలయాలపై దాడులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు.. ఆ ప్రచారానికి కౌంటర్ గా ఏం చేయాలన్నదానిపై.. పీకే సలహాలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నప్పుడు.. ఓ సందర్భాన్ని సృష్టించుకుని ముస్లిం మేకోవర్‌తో వచ్చి.. కవర్ చేసిన సీఎం ఈ సారి… చంద్రబాబు కూల్చిన ఆలయాలను కట్టిస్తామని.. సంప్రదాయ దుస్తుల్లో.. హంగామా చేశారు. ఇదంతా పీకే టీం సలహానేనని భావిస్తున్నారు. గతంలో పీకే.. ఒక్క కులంపై అన్ని కులాల్ని రెచ్చగొట్టి… వైసీపీకి ఘన విజయాన్ని సాధించి పెట్టిన పీకే.. ఇప్పుడు.. మత పరంగా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాన్ని కూడా గట్టెక్కించే బాధ్యత తీసుకోవాల్సి ఉంది. మరి పీకే.. రెచ్చగొట్టడంలోనే ఎక్స్ పర్టా.. లేకపోతే.. వాటిని చల్లబరచడంలోనూ నిపుణుడేనా అన్నది తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close