ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం వేస్టు చేసుకున్నారు. అది పూర్తయ్యే సరికి ఎన్నికలు రెండు వారాల్లోకి వచ్చేశాయి. రెండు వారాల్లో రోజుకు ఐదు చోట్ల ప్రచారరం చేసినా 75 నియోజకవర్గాల్లో మాత్రమే పర్యటిస్తారు. కానీ రోజుకు మూడుచోట్ల సభలు పెట్టి.. అది కూడా మూడు రోజులకో సారి సెలవు తీసుకుంటున్నారు.

వరుసగా నాలుగు రోజుల పాటు సభలు పది నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్ ఇప్పుడు గురువారం హాలీడే తీసుకున్నారు. వ్యూహాల కోసం అంటూ కబుర్లు చెబుతున్నారు. సభల్లో ప్రసంగించే సమయం తప్ప మిగతా సమయం వ్యూహాల కోసం కాక వీడియో గేమ్‌ల కోసం కేటాయిస్తారా ? అన్న సెటైర్లు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. గతంలో ఆయన కోసం పని చేసిన స్టార్ క్యాంపెయినర్లు ఒక్కరు కూడా లేరు. జగన్ ప్రచారం చేస్తేనే జనాన్ని సమీకరించలేకపోతున్నారు. ఇతర నేతలకు అసలు చాయిస్ లేదు. దీంతో అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కే పరిమితమవుతున్నారు.

మరో వైపు ఎటు వైపు చూసినా కూటమి కనిపిస్తోంది. నాలుగు దిక్కులా క్రౌడ్ పుల్లింగ్ లీడర్స్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ప్రతీ రోజూ సభలు పెడుతున్నారు. అంతేనా వచ్చే వారంలో రెండు రోజుల పాటు మోడీ కూడా ఏపీలో పర్యటించనున్నారు. వైసీపీ కోసం ప్రచారం చేసే వారెవరూ లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూటమి డామినేషన్ కనిపిస్తోంది. ఇది క్షేత్ర స్థాయిలో వైసీపీపై వ్యతిరేక ప్రచారం జరగడానికి మరింత కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ కు వాతావరణ శాఖ మళ్లీ బిగ్ అలర్ట్..!!

గురువారం కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ ఇంకా తేరుకోనేలేదు.. అప్పుడే మరో బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది....

ఏపీ అట్టుడుకుతుంటే విదేశీ పర్యటనా..?

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా, ఏపీ సీఎం జగన్ వైఖరి కూడా అదే తరహాలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు హింసాత్మక ఘటనలతో రాష్ట్రం భగ్గుమంటుంటే వాటిపై దృష్టి...

భూ వివాదం.. ఎన్టీఆర్ క్లారిటీ

ఎన్టీఆర్ సొంత ఇంటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ భూమి కొని మోస‌పోయాడ‌ని, ఈ కేసు విష‌యంలో హైకోర్టు వ‌ర‌కూ వెళ్లాడ‌న్న‌ది స‌ద‌రు వార్త సారాంశం....

పారితోషికాన్ని మూడు రెట్లు పెంచేసిన హీరో

'డీజే టిల్లు'తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ కెరీర్ మొత్తం మారిపోయింది. ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చేశాడు. 'టిల్లు స్క్వేర్‌' కూడా హిట్ట‌వ్వ‌డంతో ఇప్పుడు సిద్దు డేట్లు హాట్ కేకుల్లా మారిపోయాయి. సిద్దుతో సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close