సోనియా కాదు సోనియాకు ద్రోహం చేసింది వైఎస్ ఫ్యామిలీనే !

వైఎస్ అంటే కాంగ్రెస్ కు అమితమైన గౌరవం ఉందని.. సోనియా వైఎస్ కుటుంబానికి ఎలాంటి ద్రోహం చేయలేదని పంజాగుట్టలో వైఎస్ విగ్రహం సాక్షిగా షర్మిల స్ష్పష్టం చేశారు. చనిపోయిన తర్వాత కూడా సీబీఐ చార్జిషీట్ లో రాజీవ్ గాంధీ పేరు పెట్టారని తాము ఎంతో మథనపడ్డామని వైఎస్ చనిపోయాక ఆయన పేరు అక్రమాస్తుల కేసులో ఎందుకు పెట్టిస్తామని సోనియా చెప్పారని .. దీన్ని బట్టి తనకు అర్థమైందేమిటంటే.. అది తెలియక జరిగిన తప్పేనని షర్మిల తేల్చేశారు. షర్మిల మాటలు విన్న ఎవరికైనా మరి కాంగ్రెస్ కు.. సోనియాకు వైఎస్ ఫ్యామిలీ చేసిన ద్రోహం సంగతేమిటన్న ప్రశ్న వస్తుంది.

కాంగ్రెస్ లేకపోతే వైఎస్ లేడు. ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సహించింది. జగన్ రెడ్డి విపరీతమైన అవినీతికి పాల్పడినట్లుగా.. పాల్పడుతున్నట్లుగా స్పష్టమైన ఆధారాలు కళ్ల ముందు ఉన్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. మీడియా సంస్థల్ని ఏర్పాటు చేసి విధేయతగా ఇందిర పేరు పెడితే ఆహో ఓహో అనుకున్నారు. చివరికి ఆయన చనిపోయాక అందరూ అడ్డం తిరిగి.. కాంగ్రెస్ పై, సోనియాపై దారుణమైన నిందలేసి సొంత కుంపటి పెట్టుకున్నారు. అక్రమ సంపాదనతోనే పార్టీని నడిపి .. కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేశారు.

ఇప్పుడు మళ్లీ అధికారంలో వాటా రాలేదని.. ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని తేడాలు రావడంతో ఒకరు సోనియా పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా క్లీన్ చిట్స్ ఇస్తున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ.. పాత అభిప్రాయాలతోనే ఉన్నారు. కాంగ్రెస్ పై బండలేస్తూనే ఉన్నారు. ఆయనకు ఎప్పుడు అవసరం వస్తుందో కానీ అప్పుడు కూడా ఇలాంటి ప్రకటనలు చేయడానికి రెడీగా ఉంటారు. తమ రాజకీయం కోసం తాము చేసే నేరాల్ని ఎదుటి వారిపై అసువుగా చల్లేసే సహజ సిద్ద రాజకీయ నేతలు.. అవసరం వచ్చినప్పుడు వెంటనే మాట మార్చేస్తారు. షర్మిలను చూస్తే అదే ఎవరికైనా గుర్తుకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close