వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పూర్తిగా దివాలా తీసినట్లుగా కనిపిస్తోంది. ఇష్టమైన వాడు హైడ్రోజన్ బాంబు వదిలినా అద్భుతం పీల్చుకునే వైసీపీ సోషల్ మీడియా రాజకీయ ప్రత్యర్థులు మంచి చేసినా సరే తప్పు అని రెచ్చిపోతున్నారు. పవన్ కల్యాణ్ ఆదివారం ..,తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ టీంలో పని చేసే మెంబర్ ఓ సెలూన్ ప్రారంభించారు. ఆ సెలూన్ ను పవన్ ప్రారంభించారు. దాన్ని వైసీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. అందు కోసం వారు ఎంచుకున్న మార్గం మరింత కామెడీగా ఉంది.
పవన్ మంచితనాన్ని తప్పు పడుతున్న వైసీపీ సోషల్ మీడియా
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూట్ లో ఉన్న ఫోటోలను పెట్టి ఆయన పెట్టుబడుల కోసం పరుగులు పెడుతున్నారని .. పవన్ఇ క్కడ సెలూన్లు ఓపెన్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ పోలికే కాస్త తేడాగా ఉంది. అసలు భట్టి విక్రమార్క ఏ పెట్టుబడులు తెచ్చారో చెప్పడం లేదు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడులు తెచ్చారో లేదో తెలియదు. అయినా అవన్నీ అధికారిక విధుల్లో భాగం. పవన్ కల్యాణ్ .. ఆ సెలూన్ వ్యక్తిగత సిబ్బంది కోసం ప్రారంభించారు. అది అధికారిక విధుల్లో భాగం కాదు. అది ఆయన మంచితనం. తన వద్ద పని చేసే వారు మరింత ఎదిగేందుకు సహకరించే నైజం.
ఏపీకి పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణాలలో పవన్ ఒకరు
తాను గొప్ప పెట్టుబడి తెచ్చానని పవన్ చెప్పలేదే. గత ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన పెట్టుబడుల్లో ఆయన పాత్ర కూడా ఉంటుంది. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఘోరంగా మారిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారంటేనే…దానికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్. వైఎస్ఆర్సీపీ అనే రాక్షస పార్టీకి ఏపీలో స్థానం లేదని నిరూపించింది ఆయనే. గేమ్ ఛేంజర్ ఆయనే. ఏపీలో పెట్టుబడులు రావడానికి కారణం జనసేన పార్టీనే. తమ పార్టీ పునాదులు కదిలిపోవడానికి కూడా కారణం ఆయనేనని వైసీపీ ఫ్యాన్స్ కు తెలుసు.
ఏది మంచో.. ఏది చెడో తెలుసుకోకపోతే వైసీపీ సోషల్ మీడియాది సైకోతనమే !
రాజకీయాల్లో విమర్శలు అన్న తర్వాత కాస్త సెన్సిబుల్ గా ఉండాలి. వారి పనితీరును ఎస్టాబ్లిష్ చేసేలా ఉండాలి. తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శించారు. కానీ మంచి చేసినా అతి తప్పేనని ప్రచారం చేస్తే.. చూసే వారికి అసహ్యం కలుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా మొదటి నుంచి అంతే ఉంది. అందుకే ఆ పార్టీ పరిస్థితి అలా ఉంది. ఘోరమైన, వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూ.. మానసిక రోగుల్లాంటి తమ పార్టీ నేతల్లాగే తామూ అంతేనని నిరూపించుకుంటున్నారు. వారు మారుతారని అనుకోవడం.. వారికి కౌంటర్లు ఇవ్వడం కూడా జనసేన పార్టీ నేతలకు ఇబ్బందికరమే.