కుప్పం పంచాయతీల్లో వైసీపీ గెలుపు..! చంద్రబాబు పట్టు కోల్పోయినట్లేనా..?

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పంచాయతీల్లో వైసీపీ అత్యధికం గెలుచుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక వ్యూహం అవలంభించి… పుంగనూరు నుంచి తన అనుచరుల్ని కుప్పంలో దింపి.. గ్రామానికో వ్యూహం అమలు చేశారు. టీడీపీ నేతల్నిపార్టీలో చేర్చుకుని.. ఓ ఉద్యమంలా చంద్రబాబు నియోజకవర్గంలో టీడీపీని ఓడించామన్న అభిప్రాయం కల్పించడానికి శాయశక్తులా ప్రయత్నించి… చివరికి అనుకున్నది సాధించారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలుండగా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 73 చోట్ల వైసీపీ, 14 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారు.

అధికార దుర్వినియోగం చేసి..పోలీసుల్ని ప్రయోగించి… వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేయకపోతే… చర్యలు తీసుకుంటామని పెద్ద వైసీపీ అగ్రనేతలందరూ కుప్పం అధికారులకు నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. కుప్పంతో ఎలాంటి సంబంధం లేని వైవీసుబ్బారెడ్డి లాంటి వారి హెచ్చరికలు కూడా హైలెట్ అయ్యాయి. ప్రభుత్వ పథకాలు అందవని.. ఓటర్లను… టీడీపీకి పని చేస్తే కేసులు తప్పవని టీడీపీ నేతలను వైసీపీ నేతలు బెదిరించారని… టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2013 పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 12 పంచాయతీల్లో గెలిచింది.

కుప్పం ఫలితాలను చూపించి వైసీపీ నేతలు … చంద్రబాబు పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. దీనికి పోటీగా టీడీపీ నేతలు… విజయలక్ష్మి ఓటమి… వివేకానందరెడ్డి ఓటమిని చూపిస్తున్నారు. అధికారం ఉంది కదా అని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే.. అధికారం కోల్పోయిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోమని అంటున్నారు. కుప్పంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో… అందరికీ తెలుసని… చంద్రబాబును దెబ్బకొట్టామని అనుకుంటే… అది వైసీపీ నేతల అమాయకత్వమేనని.. మీడియాలో ప్రచారం చేసుకోవడానికే పనికొస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close