మళ్ళీ కలిసిన తెలుగు చంద్రులు, కేసీఆర్‌కు ఆంధ్రా స్పెషల్స్‌తో విందు

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయుత చండీయాగానికి ఆహ్వానించటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉన్న ఉండవల్లిలోని హెలిప్యాడ్‌లో కేసీఆర్ ఛాపర్ ల్యాండ్ అయ్యింది. కేసీఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు యనమల, చినరాజప్ప, రావెల కిషోర్ బాబు వారికి స్వాగతం పలికారు. ఛాపర్‌నుంచి దిగి అక్కడ ఏర్పాటుచేసిన వాహనంలో చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఇంటివద్ద బయటే నిలుచున్న చంద్రబాబు కేసీఆర్‌కు పుష్పగుఛ్ఛంతో స్వాగతం పలికారు. కేసీఆర్‌కు శాలువా కప్పి సత్కరించారు. లోపలికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ చంద్రబాబును శాలువా కప్పి సత్కరించి తర్వాత ఆయుత చండీయాగానికి ఆహ్వానపత్రికను, నూతన వస్త్రాలను, స్వీట్స్, పళ్ళు, పూలు ఇతర కానుకలను ఇచ్చారు. మీడియా ముందటే ఇరు రాష్ట్రాల నేతలూ ముచ్చటించుకున్నారు. గతంలో మనపార్టీలో ఉన్నప్పుడు కూడా యాగం చేశారు కదా అని చంద్రబాబు కేసీఆర్‌ను అడిగారు. అవునని, కానీ అప్పుడు మీడియా హడావుడి లేదుకాదా అని కేసీఆర్ చమత్కరిస్తూ, ప్రస్తుత యాగ విశిష్టతను తెలియజేశారు.

మరోవైపు కేసీఆర్, రాజేందర్, సుమన్‌లకు ఆంధ్రా ప్రత్యేక వంటకాలతో చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ విందులో కేసీఆర్‌కు ఇష్టమైన నాటుకోడి కూర, రొయ్యల ఇగురు, చేపల పులుసు, ఉలవచారు బిర్యానీ, గోంగూర, క్యారెట్ బొబ్బట్లు, కాకినాడ కాజా తదితర 15 ప్రత్యేక వంటకాలను విజయవాడకు స్వీట్ మ్యాజిక్ హోటల్‌కు చెందిన షెఫ్‌లతో చేయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close