బిహార్ ఎన్నికల తరువాత దేశంలో మత అసహనం తగ్గిపోయిందా?

బాలివుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈరోజు చాలా మంచి ప్రశ్న లేవనెత్తారు. “దేశంలో అసహనం పెరిగిపోతోందని ఇంతకాలం గగ్గోలు పెడుతూ అవార్డులు వెనక్కి ఇచ్చినవారందరూ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలయిపోగానే అకస్మాత్తుగా నిశబ్ధం అయిపోయారెందుకు? ఇప్పుడు వారి నిరసనలు ఎందుకు ఆగిపోయాయి? ఇప్పుడు ఎవరూ తమ అవార్డులను ఎందుకు వెనక్కి ఇవ్వడం లేదు? బిహార్ ఎన్నికలకు ముందు వారికి కనబడిన మత అసహనం ఎన్నికల తరువాత ఆకస్మికంగా తగ్గిపోయిందా?” అని ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని దెబ్బతీయడానికే కొన్ని శక్తులు ఈ కుట్ర పన్నాయని, ఒక పద్ధతి ప్రకారం దానిని అమలు చేసి చివరికి విజయం సాధించాయని అనుపమ్ ఖేర్ అన్నారు. జమ్మూలోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి అనుపమ్ ఖేర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రశ్నలు అడిగారు. బిహార్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మత అసహనం గురించి మాట్లాడటం తగ్గించేసాయి. అలాగే ప్రముఖులు తమ అవార్డులను వాపసు చేయడం మానేశారు. అయితే ఈ మార్పులని నేటికీ బీజేపీ నేతలు గుర్తించలేకపోవడం కాంగ్రెస్ దాని మిత్రపక్షాల అదృష్టంగా చెప్పుకోక తప్పదు. కానీ చివరికి అనుపమ్ ఖేర్ ఈ ఊహాజనితమయిన మత అసహనం వెనుక అసలు రహస్యాన్ని బయటపెట్టారు. బిహార్ ఎన్నికలలో గెలవడం కోసం రాజకీయపార్టీలు ఇంత నీచానికి దిగజారడం చాలా దారుణం. అవి తమ స్వార్ధ రాజకీయాల కోసం చేసిన దుష్ప్రచారం వలన యావత్ ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకొనే పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close