“హిందూస్థాన్ లీవర్స్…” లీడర్ మోడీనేననట..! రాహుల్ రోజుకో కొత్త విషయం చెబుతున్నారు..!!

విజయ్ మాల్యా… దేశం నుంచి పారిపోవడానికి.. ఆయనపై జారీ అయిన లుకౌట్‌ నోటీసులో మార్పు చేయడమే కారణం. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చినా.. సీబీఐ నిజమేనని అంగీకరించక తప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ… మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. ఆ లుకౌట్ నోటీసులో మార్పులు చేసింది.. ఏకే శర్మ అనే గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన మోడీకి బాగా దగ్గరనే ప్రచారం ఉండనే ఉంది. ఇప్పుడు ఈ ఏకే శర్మనే… నిరవ్ మోడీ, మోహుల్ చోక్సీల కేసును…సీబీఐ తరపున విచారణ జరుపుతున్నారట. హై ప్రొఫైల్, వివాదాస్పదమైన కేసులో ప్రధాని ఆమోదం లేకుండా లుక్ ఔట్ నోటీసులను సీబీఐ మార్చడం ఎలా సాధ్యమని రాహుల్ సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ బీజేపీ వైపు నుంచి సరైన సమాధానం రావడం లేదు.

ఏకే శర్మ ప్రస్తుతం అదనపు డైరెక్టర్‌ విభాగం, అవినీతి నిరోధక యూనిట్‌లలో పనిచేస్తున్నారు. ఎంతో కీలకమైన కేసుల మాత్రమే ఆయన చూసుకుంటారు. ఈ కీలకమైన కేసులు.. బ్యాంకుల్ని ముంచి.. విదేశాలకు పారిపోయిన వారివే. కారణం ఏమిటో కానీ.. ఇలా పారిపోయిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా దొరకడం లేదు. ఇంత పెద్ద భారతదేశం.. ప్రపంచం మొత్తం.. ప్రత్యేకంగా నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు ఎక్కువగా ఉన్న దేశంలో… ఇద్దరు నిందితుల్ని పట్టుకోవడం కాదు కదా.. కనీసం వారు ఎక్కడ ఉంటున్నారో.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కూడా తెలుసుకోలేనంత స్థితిలో సీబీఐ ఉంది.

నిజానికి నివర్ మోడీ, మోహుల్ చోక్సీ ఇద్దరూ… పాస్ పోర్టు రద్దయిందని భారత ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా చాలా కాలం పాటు.. దానిపైనే ప్రయాణం చేశారు. భారత పాస్ పోర్టుతో వారు ఎక్కడికి ప్రయాణం చేసినా.. క్షణాల్లో సమాచారం… ఆయన ఎంబసీలకు చేరుతుంది. కానీ… నెలగు గడుస్తున్నా… ఏ ఒక్కర్నీ ప్రభుత్వం వెనక్కి తీసుకురాలేకపోయింది. మోహుల్ చోక్సీకి అంటిగ్వా పౌరసత్వం వచ్చేసింది. దీనిపై… ప్రభుత్వాన్ని .. ఆ దేశం వివరణ అడిగితే.. ఎలాంటి అభ్యంతరాలు లేవని.. కేంద్రమే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు మల్యాను దేశం దాటించింది.. బీజేపీ నేతలేనంటున్నారు. ఈ విషయంలో రోజుకో అంశం బయటకు వస్తోంది. ఇలా రుణాలు ఎగ్గొట్టిన పారిపోయే వాళ్లందర్నీ..”హిందూస్థాన్ లీవర్స్” అంటూ అని పిలుస్తున్నారు జనం. వీరికి అండగా మోడీ ఉన్నారనేది .. వీడిబోతున్న మబ్బుల వెనుక ఉన్న రహస్యంగా.. ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close