అర‌వింద ప్రీ రిలీజ్‌… అతిథుల్లేరు!

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ ఆడియో ఫంక్ష‌న్ ర‌ద్ద‌య్యింది. ఎలాంటి వేడుక లేకుండా పాట‌ల్ని విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ పితృవియోగంతో ఉన్న‌ప్పుడు ఆడియో ఫంక్ష‌న్ల‌లాంటివి ఆశించ‌డం కూడా త‌ప్పే. అయితే ప్రీ రిలీజ్ వేడ‌క‌తో అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వ‌బోతోంది అర‌వింద టీమ్. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం ఫారెన్ లొకేష‌న్లో ఉంది. అక్క‌డ `అన‌గ‌న‌గ‌` టైటిల్ సాంగ్‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఫారెన్‌షెడ్యూల్ అవ్వ‌గానే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేయ‌బోతున్నారు. అక్టోబరు 2న హైద‌రాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక చేయాల‌ని ముందుగా నిర్ణ‌యించుకున్నారు. ఇప్పుడు డేట్ మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 3 న‌గానీ, 6న గానీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వేడుక నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ శుక్ర‌వారానికి చిత్ర‌బృందం హైద‌రాబాద్ తిరిగిరానుంది. ఆ త‌ర‌వాతే… ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌పై ఓ క్లారిటీ వ‌స్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి బాల‌కృష్ణ అతిథిగా రానున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే… ఈ విష‌యంలోనూ ఎలాంటి క్లారిటీ లేదు. దాదాపుగా అతిథులు లేకుండానే, కేవ‌లం చిత్ర‌బృందం స‌మ‌క్షంలోనే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. సో.. బాల‌య్య‌ని ఈ వేదిక‌పై చూసే అవ‌కాశం దాదాపుగా లేన‌ట్టే. అక్టోబ‌రు 11న `అర‌వింద స‌మేత‌` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close