మోడీ రూ. 15 లక్షలు..! కానీ విజయసాయిరెడ్డి లెక్క రూ. 20 లక్షలు..!

ఏపీ ప్రజలంతా… తలా ఓ బ్యాంక్ ఖాతాను ప్రారంభించుకోవాలి. ఆల్రెడీ బ్యాంక్ ఖాతాలు ఉంటే పర్వాలేదు. లేక పోతే వెంటనే… వెంటనే ఓపెన్ చేసుకుంటే బెటర్. రేపు ఎన్నికల్లో… పొరపాటున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే.. ఒక్కో ఖాతాలో రూ. 20 లక్షలు జమ చేసే బాధ్యతను.. విజయసాయిరెడ్డి తీసుకుంటున్నారు. అయితే.. ఈ సొమ్మంతా… తండ్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు… దోచిన సొమ్మును తీసుకొచ్చి పంచుతానని చెప్పడం లేదు…కానీ అంత కంటే.. ఎక్కువగా రాబిన్ హుడ్ వేషాలు వేస్తామంటున్నారు విజయసాయిరెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందన్న ఉత్సాహంతో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ఏపీలో ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ఇస్తామన్నట్లుగా చెప్పుకొచ్చారు.

దేశవిదేశాల్లోని చంద్రబాబు దొంగ , బినామీ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే..ఆంధ్రలో ఒక్కొక్కరికీ రూ.20లక్షలు ఇవ్వచ్చని ప్రకటించారు. విజయసాయిరెడ్డి.. తన మాటల్నే ఎన్నికల హామీగా మేనిఫెస్టోలో పెట్టించే అవకాశం కూడా ఉంది. అధినేతకు ఏకైక నమ్మకస్థుడు కాబట్టి .. లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడు కాబట్టి… ఈ విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కి తెస్తానని చెప్పిన మోడీ మాట నిలబెట్టుకోలేదు.

మోడీ చేతకానితనం వల్ల తమకు రూ.15లక్షల నల్లధనం వాటా రాలేదని అసంతృప్తిగా ఉన్న ప్రజలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇస్తున్న హామీ..పెద్ద ఊరటలగా కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో అధికారం రాగానే చంద్రబాబుపై విచారణ చేయించి ఆర్నెల్లలోగా ప్రజలకు రూ.20లక్షలు అందేలా చూస్తామని వైసీపీ చెబితే ఇక దానికి అడ్డేముంటుంది..? . ప్రజలకు ఏమీ చేయకపోయినా.. రూ. 20 లక్షలు ఇచ్చారన్న కృతజ్ఞతతో మరో రెండు సార్లు ఈడీగా గెలిపిస్తారు. ఇంత మంచి ఐడియాను… విజయసాయిరెడ్డి.. ఇంప్లిమెంట్ చేస్తారో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ అంటే కాంగ్రెస్ – బీఆర్ఎస్ కాదు !

తెలంగాణ తెచ్చింది తామేనని .. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ బాపు అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు కానీ.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. తెలంగాణపై వారి ముద్ర లేకుండా ...

కేసీఆర్ కు అన్నీ తెలుసు… ఢిల్లీ లిక్క‌ర్ కేసులో సంచ‌ల‌నం!

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్క‌ర్ కేసు బిగ్ ట‌ర్న్ తీసుకునేలా క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుపాలు కాగా... మాజీ సీఎం కేసీఆర్ కు ఈ స్కాం...

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోకి కేసీఆర్‌ను లాక్కొచ్చిన ఈడీ

కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదీ కలసి రావడం లేదు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పేరును ఈడీ తొలి సారిగా ప్రస్తావించింది. లిక్కర్ స్కాం గురించి కవిత ముందే కేసీఆర్‌కు చెప్పిందని.. గోపికుమరన్...

ఈవారం బాక్సాఫీస్‌: మూడు సినిమాల ముచ్చ‌ట‌

ఐపీఎల్ హంగామా అవ్వ‌గానే టాలీవుడ్ కి మూడ్ వ‌చ్చింది. వ‌రుస‌గా సినిమాల్ని రంగంలోకి దింపే ప‌నిలో ప‌డింది. ఈ వారం ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. విశ్వ‌క్‌సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close