కాంగ్రెస్ జాతకం మార్చే రుణమాఫీ..! మధ్యప్రదేశ్‌లో అమలు..!

దేశంలో ప్రస్తుతం రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. గత ఆరు నెలల కాలంలో ఉత్తరాది రైతులు.. ప్రభుత్వాలపై కదంతొక్కిన ఘటనలు చాలా ఉన్నాయి. కానీ పట్టించుకున్నవారే లేరు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు హామీలు ఇచ్చి వెనక్కి పంపాయి కానీ… పరిష్కారం చూపించలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించి మోడీ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు రెట్టింపు కాదు కదా… పండించిన పంటకు.. మార్కెట్ కు తీసుకు రావడానికి అయ్యే ఖర్చు కూడా రావడం లేదు. వ్యవసాయమే ప్రజల జీవనోపాధి అయిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ , చత్తీస్ ఘడ్ లలో అక్కడి ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీపై వ్యతిరేక మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించలేదు. ఆ పార్టీ రైతులకు ఇచ్చిన ఒకే ఒక్క హామీ ఓట్ల పంట పండించింది. ఆ హామీనే రైతు రుణమాఫీ. ఏక మొత్తంగా రూ. 2 లక్షల రుణమాఫీ. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ అలా బాధ్యతలు చేపట్టి.. ఇలా మొదటి సంతకంగా.. రుణమాఫీపై చేసేశారు.

రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ. ఒక్క మధ్యప్రదేశ్ కే కాదు… చత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లోనూ ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం.. రాహుల్ గాంధీ రెండు లక్షల హామీని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో ఇప్పుడు రుణమాఫీ అమలు చేయబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా.. కాంగ్రెస్ పార్టీ .. రైతులను ఆకట్టుకునేందుకు రుణమాఫీనే ప్రధాన అస్త్రంగా చేసుకోబోతోంది. దేశవ్యాప్తంగా రుణమాఫీ అమలు చేస్తామనే హామీతో ప్రజల్లోకి రాబోతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదే తురుపుముక్క. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీపై రైతుల్లో నమ్మకం ఉంది. మధ్యప్రదేశ్ లో అధికారంలో చేపట్టిన వెంటనే.. సంతకం చేయడమే దానికి కారణం కాదు… యూపీఏ వన్ హయాంలో… ఎన్నికలకు వెళ్లే ముందు.. హామీ ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా రుణమాఫీని కేంద్రం అమలు చేసింది. అప్పట్లోనే ఇలా మాఫీ చేసిన మొత్తం రూ. 75 వేల కోట్ల వరకూ ఉంటుంది. అదే.. యూపీఏని రెండోసారి అధికారంలోకి తెచ్చి పెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి అదే రుణమాఫీ పెద్ద అస్త్రంగా మారింది.

ఈ సారి ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీని ప్రకటించి దేశవ్యాప్తంగా రైతుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు గెలిచిన మూడు రాష్ట్రాల్లో అమలు చేయడం.. మిగతా రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారని అంచనా వేసుకున్న బీజేపీ తాము కూడా రుణమాఫీ చేసి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్నదానిపై సమాలోచనలు జరిపింది. కానీ ఇప్పుడు దానికంత సమయం లేకపోవడంతో… అది తమ విధానాలకు విరుద్ధమని చెబుతోంది. కార్పొరేట్లకు లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసి.. రైతులకు చేయడంలో ఇబ్బందేమిటన్న ప్రశ్న.. కాంగ్రెస్ నుంచి వస్తోంది. కానీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close