మోడీకి “వైట్ పేపర్ల”తో స్వాగతం..! చంద్రబాబు వ్యూహం..!!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీలో ఎన్నికల భేరీని మోగించబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు… మోడీని విభిన్నంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. మోడీ ఏపీకి రాక ముందే… నాలుగున్నరేళ్లలో ఆయన చూపించిన వివక్ష ప్రజల ముందు ఉంచడానికి సిద్ధమయ్యారు. పనిలో పనిగా తాను చేసిన అభివృద్ధినికూడా.. హైలెట్ చేయబోతున్నారు. అందు కోసం చంద్రబాబు ఎంచుకున్న వ్యూహం “శ్వేతపత్రాలు”. 2014లో అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రం ఉన్న పరిస్థితి పై ఆనాడు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, తీసుకువచ్చిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు.

శ్వేతపత్రం అంటే… ఆయా రంగాల్లో ఉన్న ఏ టూ జడ్ వివరాలు ప్రకటించడం. గతంలో ఎలా ఉంది..ఇప్పుడెలాఉందో.. వివరించడం. నాలుగున్నరేళ్ల కాలంలో.. కేంద్రం రాష్ట్రానికి ఏమివ్వాలి..? ఏమిచ్చింది అనే అంశాన్ని హైలెట్చే
యబోతున్నారు. కేంద్రం నుంచి సాధారణంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయకపోవడం వంటి అంశాలపై ప్రజల ముందు వాస్తవాలను “వైట్ పేపర్ల” ద్వారా ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రెవిన్యూ లోటు నుంచి పోలవరం వరకూ.. ఏ విషయంలోనూకేంద్రం సాయంపై ప్రభుత్వం సంతృప్తిగా లేదు. జాతీయప్రాజెక్టుగా కనిపించినప్పటికీ నేటికీ నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు బకాయిల రూపంలో ఉన్నాయి. ఇవన్నీ శ్వేత పత్రంలో ప్రకటించి మోడీ రాకముందే ఈ పత్రాన్ని విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

నరేంద్ర మోడీ జనవరి 6వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు. జనవరి మొదటి వారంలో చంద్రబాబు శ్వేత పత్రాల విడుదలను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా ఎన్నికలకు ముందే ఎవరేమిటో.. తేలిపోతుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి శ్వేతపత్రాలకు బీజేపీ సమాధానం చెబుతుందా..? అన్నదే టీడీపీ నుంచి వస్తున్న ప్రధానమైన ప్రశ్న.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close