కాంగ్రెస్‌ “న్యాయ్‌”తో బీజేపీ అన్యాయమైపోతోందా..?

పేదలకు ఏడాదికి రూ. 72వేలు ఇస్తామంటూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన “న్యాయ్” పథకం ఉత్తరాది ఓటర్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఎన్నికల విశ్లేషణలు మొత్తం కులాలు, మతాల ప్రకారం చేస్తున్నారు కానీ… “న్యాయ్” పథకం ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారనే విశ్లేషణ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దక్షిణాదిలో “న్యాయ్” పథకంపై పెద్ద చర్చ… రచ్చ జరగలేదు కానీ.. ఉత్తరాదిలో మాత్రం.. ఇదో హాట్ టాపిక్ అయింది. నాలుగు దశల ఎన్నికల తర్వాత.. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే..”న్యాయ్” పథకంతో.. బీజేపీ అన్యాయమైపోయే సూచనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం… చాలా ఎక్కువ మందిలో ఏర్పడుతోంది.

పైగా… 2014లో రంగుల ప్రపంచం చూపించిన మోడీ.. 2019కి వచ్చే సరికి చౌకీదార్‌ని అంటున్నారు.. కానీ.. ఐదేళ్లలో ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు. నోట్ల రద్దుతో ఒక పక్క, జీఎస్టీతో మరో పక్క జనం నడ్డి విరిచారు. మోదీని ఎన్నుకుని ఇబ్బంది పడ్డామన్న భావన జనంలో బాగా పెరిగిపోయింది. ఐదేళ్లలో మోదీ పరపతి మైనస్సుల్లోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలాంటి భావోద్వేగాలను నమ్ముకోలేదు. తొలి నుంచి ప్రజల్లో తమకున్న పరపతినే ఓట్లుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. యూపీఎ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, 2019లో మళ్లీ ఆధికారానికి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల ఆధారంగానే విజయం సాధించేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేసుకుంటోంది. గతంలో యూపీఏ రుణమాఫీ లాంటిపథకాలను పకడ్బందీగా అమలు చేసింది. అందుకే ఇప్పుడు ప్రతీ పేద వాడి ఖాతాలోకి ఎటా 72 వేల రూపాయలు వేస్తామన్న హామీ ప్రజల్లో పలుకుబడి సాధించింది. ఇదే తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. రాహుల్ నోట ఆ హామీ వచ్చిన తర్వాత బీజేపీ వర్గాల్లో టెన్షన్ పెరిగిందనే చెప్పారు.

ఏదో ఓ భావోద్వేగ పరిస్థితులు లేకపోతే.. బీజేపీ గెలవడం అసాధ్యమనే అంచనాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అందుకే… పాకిస్తాన్ గురించి పదే పదే చెబుతూ… మోడీ.. భావోద్వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో భావోద్వేగాలు పనిచేయడం లేదు. భావోద్వేగాలను సృష్టించి తనకు అనుకూలంగా మార్చుకోవాలని మోదీ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. పుల్వామా ఉగ్రదాడిని చూపించి జనంలో సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలనుకున్న మోదీ ప్రయత్నానికి జనం నుంచి స్పందన లేదు. పాకిస్థాన్ ను బూచిగా చూపించి ఏదో సాధిద్దామనుకుంటే ఫలితం దక్కలేదు. ఇప్పుడు.. బీజేపీ ‌అన్యాయం అయిపోతోందనే అభిప్రాయం బలపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close