కోమటిరెడ్డి ఫోన్, జగ్గా రెడ్డి కూడా బీజేపీలోకేనా ?

ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఒక్క సారిగా తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన బీజేపీ లోకి వెళ్లడం ఖాయం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆయన రేపు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలువనున్నారు అని వార్తలు వస్తుండడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన బీజేపీ లోకి వెళ్లడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ కి వెళ్లడానికి ముందు ఆయన మరొక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తో ఫోన్ లో మాట్లాడటం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలను బీజేపీ లోకి తీసుకెళ్లి పోతున్నారని రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. రేపు జరిగే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం భేటీ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి ఉందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అయినా కనీసం కాంగ్రెస్ నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో మార్చి ఉంటే బాగుండేదని, కానీ అలా జరగలేదని , భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ తిరిగి లేచే అవకాశం లేదని ఆయన అంటున్నారు.

జగ్గారెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీ మీద ఒంటి కాలుతో లేచి పోరాడేవాడు. కానీ 2018 ఎన్నికలకు ముందు ఆయన మీద కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన కేసుల తర్వాత, ఆయన వైఖరి కొంచెం మారినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ మీద ఏ విధమైన తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. పైగా కేసీఆర్ మీద కొన్ని సానుకూల వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ చెంతకు చేరతాడా అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి.‌ అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి జగ్గారెడ్డి ని బీజేపీలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close