ముగ్గురు హీరోల‌తో… షాలినీ పాండే

స్వ‌ప్న సినిమాపై అశ్వ‌నీద‌త్ కూతురు స్వ‌ప్న‌ద‌త్ ఓ చిత్రాన్ని నిర్మించ‌డానికి రెడీ అయ్యింది. పిట్ట‌గోడ ఫేమ్ అనుదీప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. క‌మెడియ‌న్లు ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌ల‌తో పాటు `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌` హీరో న‌వీన్ పొలిశెట్టి క‌థానాయ‌కులుగా న‌టించ‌నున్నారు. ఇందులో క‌థానాయిక‌గా షాలినీ పాండే ని ఎంచుకున్నారు. క‌థానాయిక పాత్ర‌కు అధిక ప్రాధాన్యం ఉండే సినిమా ఇది. కాస్త నేమూ, ఫేమూ ఉన్న నాయిక కోసం చిత్ర‌బృందం అన్వేషించింది. అందులో భాగంగానే షాలినీని ఎంచుకున్నారు. ఇందులో షాలినీ ఓ న్యాయ‌వాదిగా క‌నిపించ‌నుంది. స్ర్కిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. మ‌హాన‌టి లాంటి సినిమాలో స్వ‌ప్న సినిమా.. పాపుల‌ర్ అయ్యింది. ఈసారీ క‌థాబ‌లం ఉన్న సినిమానే తీస్తున్నారు. పిట్ట‌గోడ‌తో ఫ్లాప్ ఇచ్చినా స‌రే – క‌థ‌పై న‌మ్మ‌కంతోనే అనుదీప్‌కి అవ‌కాశం ఇచ్చారు. మ‌రి ఈసారి ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close