ఆ కాపు నేతలందరికీ రెండు పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నాయట..!

తెలుగుదేశం పార్టీలో కాపు నేతలందరూ కాకినాడలో రహస్యంగా సమావేశం కావడం కలకలం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన రాష్ట్రంలోని కాపు అభ్యర్దులు, మాజీ ఎమ్మెల్యేలంతా గురువారం కాకినాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందే ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు నేతలంతా కాకినాడ వచ్చారు. వీరంతా ఓటమిపై విశ్లేషణ చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై కూడా వీరు చర్చించుకున్నారు. బీజేపీలో చేరడం వల్ల రాష్ట్రంలో వైసీపీ నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోవడంతో పాటు కార్యకర్తలను కూడా రక్షించుకోవచ్చని ఒకరిద్దరు నేతలు సమావేశంలో సలహా ఇచ్చినట్లు తెలు్సోతంది. 

అయితే బీజేపీలోకి వెళితే కార్యకర్తలు రారనే అభిప్రాయానికి వచ్చారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీలోకి వెళ్లే అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది.  సమావేశంలో పాల్గొన్న కొంతమంది నేతలు మాత్రం వైసీపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపారు. కొంత మంది వ్యతిరేకించారు. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయనతో ఒకసారి భేటీ అవుదామని అంతిమంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్ోతంది. పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు మారడం మంచిది కాదని కూడా మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  ఎక్కువ మంది బీజేపీలోకి వెల్లేందుక ఇష్టపడకపోయినప్పటికీ, ఇప్పుటికిప్పుడే ఎవరూ బయటపడవద్దని, అన్ని విషయాలను మదింపు చేసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చారు. 

మొత్తానికి కాపు సామాజికవర్గ నేతలు.. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టం అయింది. ఆ మంచి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందన్నదానిపైనే.. వారి రాజకీయ పయనం ఉంటుందని చెబుతున్నారు. అది టీడీపీ నుంచా.. లేక వైసీపీ నుంచా.. అన్నదానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ లేదు. త్వరలోనే…  మరిన్ని సంచలనాలు ఉంటాయన్న నేపధ్యంలో.. ఆ సంచనాల్లో వీరు కూడా చేరే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close