ఆ నలుగుర్ని కేసీఆర్‌ కేబినెట్‌లోకి తీసుకుంటే కులాల కుంపటే..!?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజకీయంగా తలపండిపోయిన వ్యక్తి. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. ముందుగా.. ఆ నిర్ణయాన్ని ప్రజల్లోకి పంపి.. ప్రజాస్పందనను పరిశీలించి.. ఆనక నిర్ణయం తీసుకుంటారు. ముందస్తు ఎన్నికల దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ కేసీఆర్ అదే ఫార్ములా పాటించారు. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గం విషయంలోనూ అదే ఫార్ములా పాటిస్తున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని… నలుగుర్ని తీసుకోబోతున్నారని.. నమస్తే తెలంగాణ కన్నా.. ఎక్కువగా.. టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న సాక్షి మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. ఆ నలుగురు మంత్రులూ అగ్ర సామాజికవర్గాలకు చెందిన వారే. కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల, వెలమ సామాజికవర్గం నుంచి హరీష్, కేటీఆర్, రెడ్డి సామాజికవర్గం నుంచి.. సబితా ఇంద్రారెడ్డిని తీసుకోవాలనకుంటున్నట్లుగా సాక్షి జనంలోకి ఫీలర్ పంపింది. ఆ తర్వాత మరో రెండు బెర్తులు ఖాళీ అవుతాయని… వాటిని గతంలో మాటిచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డికి ఇస్తారని సాక్షి మీడియా చెబుతోంది.

నిజానికి కేబినెట్ విస్తరణపై కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. సామాజికవర్గాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం ఆధారంగా కేసిఆర్ గత కేబినెట్ లో టీంను ఎంపిక చేసుకున్నారు. అయితే కొంత మంది విషయంలో ఆయన ఒకింత అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఇంఛార్జిలుగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రుల విషయంలో కొంత కోపంగా ఉన్నట్లు సమాచారం. పరిషత్ ఎన్నికల ఫలితాలు కేసిఆర్ కోపాన్ని కొంత తగ్గించినట్లైంది. హరీష్, కేటిఆర్ ను పక్కాగా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఆయనకు తిరిగి పాత శాఖలనే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి సభితా ఇంద్రారెడ్డి కి కెబినెట్ బెర్త్ ఖాయమైంది. ఆ హామీ మేరకే ఆమె కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ గుటికి చెరుకున్నారు.

అయితే సాక్షి చెప్పినట్లుగా.. వచ్చే ఆరు బెర్తుల్లో మూడు రెడ్లు, రెండు వెలమ, ఒకటి కమ్మలకు ఇస్తే.. సామాజిక సమీకరణాలు దెబ్బతింటాయి. మాదిగ, మున్నూరు కాపు, ఎస్టీ సామాజిక వర్గాలనుండి ప్రాతినిధ్యం లేదు. సత్తుపల్లి టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొంది టిఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయిన సండ్ర వెంకట వీరయ్య పేరు ప్రచారంలోకి వచ్చినా.. చివరికి… తుమ్మల పేరు ఫైనల్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి గత కేబినెట్ లో జోగు రామన్న మంత్రి గా ఉన్నారు. అయితే తొలి విడత కేబినెట్ లో కేసిఆర్ అవకాశం ఇవ్వలేక పోయారు. జోగు రామన్న, దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, దాస్యం వినయ్ భాస్కర్ ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలుగా ఉన్నారు. కేబినెట్ బెర్తులపై సాక్షి ప్రచారానికి టీఆర్ఎస్ లో పెద్దగా అసంతృప్తి కనబడకపోతే.. వారినే కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close