హైకోర్టు తీర్పు జగన్ మీడియాకు వినిపించలేదు..! కనిపించలేదు..!

నేను ఉన్నాను… నేను విన్నాను..! అంటూ… జగన్మోహన్ రెడ్డి మీడియా… సాక్షి.. ఎన్నికల సమయంలో ఎంత హడావుడి చేసిందో… ప్రజలందరికీ ఇంకా గుర్తుంది. అయితే.. ఎన్నికలు పూర్తయి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత… జగన్ మీడియాకు.. ఏమీ వినిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అవసరమైన చోట మాత్రం.. కాస్త తేడాగా వినిపించుకుని.. కల్పించుకుని రాస్తోంది. ఆ వెసులుబాటు లేని చోట… అసలు వార్తకే జెల్ల కొడుతోంది. ప్రస్తుతం.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో… హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు విషయంలో… సాక్షి పత్రిక.. ఇదే పద్దతిని పాటించింది. కేవలం నాలుగంటే..నాలుగు లైన్లు.. అదీ కూడా.. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించినదని ఎక్కడా చెప్పకుండా.. హైకోర్టు తీర్పు వార్త రాసేసి.. తమకు అసలు మనస్సాక్షి లేదని… దాన్ని ఎప్పుడో చంపేసుకున్నామని నిరూపించుకున్నారు.

పోలవరం రివర్స్ టెండర్లను.. నిలిపి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పులో ఎన్నో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒప్పందాలను.. ప్రభుత్వం ఏకపక్షంగా ఉల్లంఘిస్తూ.. రద్దు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పవర్ ప్రాజెక్ట్ విషయంలో… అసలు ఏపీ సర్కార్ ఏ అధికారంతో.. కాంట్రాక్టును టెర్మినెట్ చేసిందని ప్రశ్నించింది. ఓ రకంగా.. ఏపీ సర్కార్.. మొండి వాదనకు.. దందుడుకు నిర్ణయాలకు… హైకోర్టు తీర్పు గట్టిగానే షాక్ లా తగిలింది. దీనిపై.. తమ వాదన వినిపించుకునే అవకాశం కూడా సాక్షికి దొరకలేదు. అందుకే.. ఓ చిన్న కాలమ్‌ ఆర్టికల్‌తో సరిపెట్టారు.

నిజానికి సాక్షి మీడియాది ఓ ప్రత్యేక శైలి. తమకు ఏది కావాలో… అది ఊహించేసుకుని రాసుకుంటుంది. కొన్నాళ్ల కిందట.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశం జరిగింది. ఆ సమయంలో… రివర్స్ టెండర్లు వద్దని పీపీఏ స్పష్టంగా చెప్పింది. అయితే సాక్షి మాత్రం.. పీపీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తమ పత్రికకలో రాసుకున్నారు. ఇప్పుడు.. హైకోర్టు తీర్పు విషయంలో.. అలాంటి వెసులుబాటు.. సాక్షి మీడియా తీసుకోలేకపోయింది. అలా తీసుకుని ఉంటే.. కోర్టు ధిక్కరణ అవుతుందని భయపడ్డారేమో కానీ.. చిన్న వార్తతో సరిపెట్టారు. అందులోనూ.. ఎన్నో నిజాలు దాచి పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close