కాంగ్రెస్‌పై ఈడీ..! చిదంబరం తర్వాత శివకుమారే..!

కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్…శివకుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చిదంబరం లాగే… జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అర్థరాత్రి బెంగళూరులో సమన్లు పంపి.. తర్వాతి రోజు మధ్యాహ్నం ఢిల్లీలో ఈడీ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఆయన హాజరయ్యారు. శివకుమార్‌ను మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లయితే కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరంలాగే ఆయన కూడా కొంతకాలం జైల్లో ఉండాల్సిందే. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లే ముందు ఆయన తాను హత్యలు చేయలేదని.. అత్యాచారాలు చేయలేదని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.

కర్ణాటక రాజకీయాల్లో డీకేఎస్‌గా చిరపరిచితుడైన శివకుమార్‌ అక్కడ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్ లాంటి వ్యక్తి. 27 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఆయన ట్రబుల్‌ షూటర్‌గానే పేరు పొంందారు. 1990లో బంగారప్ప కర్ణాటక సీఎంగా పనిచేసినప్పుడు 29 ఏళ్లకే మంత్రి అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. 2013లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదు. 2014లో ఇవ్వక తప్పలేదు. బీజేపీతో కర్ణాటకలో రాజకీయ ప్రత్యర్థిగా తలపడినా.. ఢిల్లీ పెద్దలకు.. శివకుమార్ టార్గెట్ అయింది మాత్రం… గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలోనే. అహ్మద్ పటేల్‌ను గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ ప్రయత్నించినప్పుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బెంగళూరు క్యాంపుకు తరలించి పటేల్ పరువు కాపాడారు శివకుమార్. ఈడీ, ఐటీ దాడులు జరిగినా శివకుమార్ భయపడలేదు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల తర్వాత బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తొలుత బెంగళూరు రిసార్ట్‌కు తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలే ఉన్నాయి. శివకుమార్ ను కంట్రోల్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. మరో పక్క ఈడీ కేసు ఆయన్ను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై.. ఆయన కేసుల నడక కూడా ఆధారపడి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close