పోలవరం మాయ..! కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి రివర్స్ టెండర్..!?

పోలవరం రివర్స్ టెండర్లపై హైకోర్టు స్టే విధించినా ఏపీ సర్కార్ ఆగడం లేదు. డబ్బులిచ్చే కేంద్రం హెచ్చరిస్తున్నా.. లెక్క చేయడం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారో…? ఎందుకు ఇంత హడావుడి పడుతున్నారో..? ఎందుకు పాత కాంట్రాక్టర్లపై అంత వేగంగా వేటు వేశారో..? సామాన్యులకు అర్థం కావడం లేదు. అయితే.. ఆ రివర్స్ టెండర్ల కోసం మార్చిన రూల్స్… ఒక్కొక్కటిగా బయటకు వస్తూంటే.. ఇప్పటికే కాంట్రాక్టర్‌ను ఖరారు చేశారని… వారికి అధికారికంగా అప్పగించడానికే.. టెండర్ల ప్రక్రియ ప్రారంభించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రివర్స్ టెండర్లలో నిబంధనలన్నీ రివర్స్..!

మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలని.. ఎవరికైనా… కాంట్రాక్టుకు ఇవ్వాలంటే… ముందుగా ఏం చూస్తాం..? ఆయన అంతకు ముందు ఏ ఇళ్లు కట్టాడు..? ఎంత బాగా కట్టాడు..? మనకు కావాల్సిన టైప్ ఇళ్లు ఎన్ని కట్టాడు..? ఎలా కట్టాడు..? అనేది చూసుకుంటాం. అలాగే ఆయనకు ఇల్లు కట్టడానికి అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉందా లేదా.. అన్నది కూడా చూసుకుంటాం. ఇక పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టు చేపట్టాలంటే… ఇవి ఇంకా ఎక్కువ పరిశీలించాల్సి ఉంటుంది. కానీ పోలవరం రివర్స్ టెండర్లలో… ఇవేమీ చూడరు. కేవలం… తమకు పనులు చేపట్టగలిగే ఆర్థిక సామర్థ్యం ఉందని.. బ్యాంక్ గ్యారంటీ లేదా.. డిమాండ్ డ్రాఫ్ట్ చూపిస్తే చాలు… కాంట్రాక్టర్లను ఖరారు చేస్తారు. సాంకేతిక, ఆర్థిక అర్హతలను కూడా… ఇంత వరకూ ఖరారు చేయలేదు. టెండర్లలో పేర్కొనలేదు. డీడీని చూసి టెండర్ ఖరారు చేసి… అప్పుడు ఆ అర్హతలు డిసైడ్ చేస్తారట. అంటే.. తమకు కావాల్సిన వారికి ఏ అర్హతలు ఉన్నాయో… వాటిని డిసైడ్ చేసి.. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు. అంటే.. ” ఇప్పటికే నిర్ణయించిన వ్యక్తి లేదా సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి..” ఈ రివర్స్ అన్నమాట.

“ఆ కాంట్రాక్టర్” కోసమే ఇతర నిబంధనలూ మార్పు..!?

పోలవరం రివర్స్ టెండర్లకు ఇప్పటికే కాంట్రాక్టర్ ను ఖరారు చేశారని.. వారికి ఏ ఏ అర్హతలు ఉన్నాయో.. లెక్క చూసుకుని.. వాటినే… రివర్స్ టెండర్లలో పెట్టారని.. ఇతర నిబంధనల సడలింపుతోనూ అర్థమవుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. గతంలో అనుభవం … పదేళ్లు ఉండేది. కానీ ఇప్పుడు చాలా కంపెనీలను ఎలిమినేట్ చేయడానికి 15 ఏళ్లు మార్చారు. ఈ విషయంలో…కావాల్సిన అనుభవం పెంచేసిన ప్రభుత్వం మరి సకాలంలో పనులు చేసిందా లేదా.. అన్న విషయాలను పరిగణనలోకి తీసకోవడానికి సిద్ధంగా లేదు. గత ఐదేళ్లలో మూడేళ్లు సక్రమంగా… నెట్‌వర్త్ మెయిన్‌టెయిన్ చేస్తే చాలన్నట్లుగా నిబంధనలు మార్చారు.

కేంద్ర విజిలెన్స్ నిబంధనలు కూడా పాటించనంత పాదర్శకత..!?

రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగానే వ్యవహరిస్తోంది. రివర్స్ టెండర్ల పేరుతో… స్వంత వారికి కాంట్రాక్టర్లను కట్ట బెట్టేందుకు కావాల్సినంతగా నిబంధనలు మార్చేస్తోంది. అయితే.. ఇవన్నీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. సీవీసీ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం కాంట్రాక్టర్ టెక్నికల్, ఫైనాన్షియల్ అర్హతలను గుర్తించి.. షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత ఎల్ -1 కాంట్రాక్టర్‌ను ఇతర నిబంధనల ప్రకారం ఖరారు చేస్తారు. కేంద్ర, రాష్ట్రాల కాంట్రాక్టులన్నీ ఇవే నిబంధనలతో ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఈ రూల్స్ మార్చేశారు. అందుకే.. అందరిలోనూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇది ఇలాగే ఉంటే.. న్యాయవివాదాల్లో చిక్కుకోవడం చాలా సులువని.. పోలవరం నిర్మాణాన్ని ముందుగు సాగదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close