సీమకే శ్రీవారి నిధులు..!

తిరుమల శ్రీవారికి వస్తున్న ఆదాయం మొత్తాన్ని రాయలసీమలోనే ఖర్చు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారు. తన వాదనకు మద్దతుగా విజయవాడ, సింహాచలం ఆలయాల డబ్బు ఆ ప్రాంతాలకే ఖర్చు చేయాలని కూడా.. అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యేకంగా సీమ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తూండటంతో… టీజీ వెంకటేష్.. మరింత అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. ఆయన కొంచెం దూకుడుగానే రాయలసీమ అంశాలను మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ ఇప్పుడు.. సీమ విషయంలో… ప్రత్యేకంగా ఉండటంతో.. దాన్ని టీజీ వెంకటేష్ మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా సీమలో హక్కుల సంఘాలు, ఉద్యమ సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి.

రాయలసీమ నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని… కూడా టీజీ వెంకటేష్ అంటున్నారు. గోదావరి జలాలు కృష్ణా ప్రాంతానికి ఇచ్చి.. రాయలసీమకు రావాల్సిన నీళ్లను ఇస్తామని నాడు వైఎస్ చెప్పారని.. కానీ ఇంత వరకు అమలు కాలేదని అంటున్నారు. కేంద్రం నిధులతో ప్రాజెక్టులను స్పీడ్ బ్రేకర్లు లేకుండా పూర్తి చేయాలని.. అలా చేస్తేనే సీమకు నీళ్లొస్తాయని ఆయనంటున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి.. తన మేనిఫెస్టో ప్రకారం.. పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్నారని.. ఆదాయం మొత్తం అక్కడే ఖర్చయిపోతోందంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని విషయంలో టీజీ వెంకటేష్.. కొన్ని కీలకమైన వ్యాఖ్యలను కొద్ది రోజులుగా చేస్తున్నారు. జగన్ నాలుగు రాజధానులు చేయబోతున్నారన్న ప్రచారాన్ని ఆయనే ప్రారంభించారు. అయితే.. ఆ తర్వాత వాటిని ప్రాంతీయ బోర్డులుగా మార్చారు. ఇప్పుడు.. ప్రాంతీయ బోర్డు డిమాండ్ ను బీజేపీ అందుకుంది. ప్రాంతీయబోర్డులను ఏర్పాటు చేసి.. రూ. 20వేల కోట్లను రాయలసీమకు కేటాయించాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నారు. అదే సమయంలో.. అమరావతి ఫ్రీజోన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ సీమ వాదంలో.. మరో ప్రత్యేకమైన వాదాన్ని టీజీ వెంకటేష్ మరింత జోరుగా ముందు ముందు వినిపించే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close