వల్లభనేని వంశీ ఖాతాలోనూ ఓ కేసు..!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై నమోదవుతున్న కేసుల పరంపరలో తాజాగా వల్లభనేని వంశీ పేరు కూడా చేరింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారన్న కేసును ఆయనపై నమోదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని బాపులపాడు తహశీల్దార్ నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఆయా చోట్ల స్థలాలే లేవని.. అయినప్పటికీ.. పేదలకు ఇళ్ల పట్టాలను సిద్ధం చేశారని.. తహశీల్దార్ చెబుతున్నారు.

ఎన్నికలకు ఏడాది ముందు నుంచి తన నియోజకవర్గంలో పలువురు పేదలకు.. వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నారు. స్వయంగా… ప్రభుత్వంతో చెప్పి పనులు చేయించుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ.. ఇళ్ల పట్టాలిచ్చినట్లుగా ఆరోపిస్తూ.. కేసు నమోదు చేయించడం టీడీపీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్నాళ్లుగా వల్లభనేని వంశీపై అధికార పార్టీ గురి పెట్టిందని.. చివరికి… ఇలా.. తహశీల్దార్ రూపంలోనే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెదకపోయిన తీగ కాలికి తగిలిందని తెలుస్తోంది.

వల్లభనేని వంశీపై… ఎన్నికలకు ముందు నుంచీ తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో స్థలాలపై అక్కడి పెద్దల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఓ దశలో ఆయన పోటీ నుంచి విరమించుకుందామనుకున్నారు. గెలిచిన తర్వాత ప్రతీ వారం.. ఆయన పార్టీ మారబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. సుజనా చౌదరితో సన్నిహిత సంబంధాలుండటంతో.. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని.. కొడాలి నానితో టచ్‌లో ఉండి.. వైసీపీలోకి వెళ్తున్నారని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. మొదట్లో.. పార్టీ మార్పు వార్తలపై స్పందించిన వంశీ.. ఆ తర్వాత స్పందించడం మానేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close