క్లారిటీ..! ఐటీ గ్రిడ్ కేసు రాజకీయ కుట్రే..!

ఎన్నికలకు ముందు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిందంటూ.. చేసిన ప్రచారం… పెట్టిన కేసులు అన్నీ కరెక్ట్ కాదని.. కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఈ మేరకు.. పార్లమెంట్‌లోనే.. కేంద్రమంత్రి సంజయ్ థాత్రే స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఆధార్‌ డేటాను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని.. డేటా చోరీ ఉత్పన్నమయ్యే సమస్యే లేదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. ఈ అంశంపై.. రాజ్యసభ సభ్యుడు కేవీపీ.. కేంద్రాన్ని ఓ ప్రశ్న అడిగారు. ఐటీ గ్రిడ్‌ ద్వారా ఆధార్‌డేటాను టీడీపీ చోరీ చేసిందని .. గతంలో ఆరోపణలు వచ్చాయని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీనే హడావుడి చేసిందని.. గుర్తు చేశారు. ఇప్పుడా కేసు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీకి యాప్ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ అనే కంపెనీ… విజిల్ బ్లోయర్ గా చెప్పుకుంటున్న లోకేశ్వర్ రెడ్డి అన్ వ్యక్తి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం హడావుడి చేసింది. కేసులు నమోదు చేసి.. పోలీసులు హంగామా సృష్టించారు. టీడీపీ యాప్ సమాచారాన్ని మొత్తం వారు తీసుకెళ్లారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంలో… ఆధార్ చోరీ జరిగే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఓటర్ వివరాలు ట్యాంపరింగ్ చేయడం కూడా సాధ్యం కాదని… ఈసీ చెప్పింది. ఈ క్రమంలో.. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేసి… పోలీసులు పొలిటికల్ గేమ్ ఆడారన్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వ సమాధానంతో… బలం చేకూరినట్లయింది. ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఐటీ గ్రిడ్ కేసు కూడా.. ప్రచారాస్త్రం అయింది.

టీడీపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిందని.. జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కొసమెరుపేమిటంటే.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… డేటా చోరీ అంటూ ఆరోపణలు చేసి వెళ్లారు. తీరా.. అలాంటి చోరీ ఏమీ ఉండదని.. అసాధ్యమని.. కేంద్రం చెప్పడంతో…అప్పట్లో టీడీపీపై రాజకీయ కుట్ర జరిగిందా.. అన్న కోణం వైపు.. విషయం మళ్లుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close