ఎమ్మెల్సీలకు చంద్రబాబు చెబుతున్నది ఒక్కటే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ నుంచి… ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి ..తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. క్యాంపులు లాంటివేమీ ఏర్పాటు చేయడం లేదు కానీ.. తాత్కాలిక ప్రయోజనాలకో.. బెదిరింపులకో భయపడితే.. మాత్రం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అన్న సందేశాన్ని మాత్రం బలంగా పంపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీలకు సూటిగానే చెబుతున్నారు. 1984లో టీడీపీ నిర్వహించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్న వారే తర్వాతి కాలంలో ప్రముఖ నేతలయ్యారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా.. అలాంటి ఉద్యమమే జరుగుతోందని.. మూడు రోజుల కిందట.. మండలిలో.. అమరావతి కోసం మద్దతుగా నిలబడిన వారికి వచ్చిన ప్రజాస్పందన ఎలా ఉందో.. గుర్తుంచుకోవాలంటున్నారు.

ఈ విషయంలో ఎమ్మెల్సీలను ఆయన అనుమానించడం లేదు. కానీ.. ఎప్పుడు ఎవరు.. ఎలా మారిపోతారో ..చంద్రబాబు కూడా అర్థం కాని పరిస్థితి. నిజానికి ఇప్పటికి ఎమ్మెల్సీలుగా ఉన్న 27 మంది .. సుదీర్ఘ కాలం నుంచి టీడీపీలో ఉన్నవారే. వారి సేవలకు గుర్తింపుగానే.. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఫిరాయింపులతో వచ్చిన వారికి… ఎమ్మెల్సీలు ఇస్తే.. వారు వెళ్లిపోయారు. డొక్కా, శివనాధ్ రెడ్డి ఇప్పటికే టీడీపీకి ఝులక్ ఇచ్చారు. మిగిలిన వారిలో అందరూ..టీడీపీ విధేయులే. కానీ.. జగన్ పార్టీకి ఇంకా నాలుగేళ్లకుపైగా.. అధికారం ఉంటూండటం.. పెద్ద మొత్తంలో ఆర్థిక లాభం… రాజకీయ భవిష్యత్ ను ఆశ చూపుతూండటంతో.. ఎమ్మెల్సీల్లో కొందరు ఊగిసలాటతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు కూడా.. తాను చెప్పాలనుకున్నది చెబుతున్నారు కానీ.. ఎవరిైనా నిఘా పెట్టడం …లాంటివి చేయడం లేదు. ఉంటే ఉన్నారు.. లేకపోతే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం.. టీడీపీకి విధేయంగా ఎంత మంది ఎమ్మెల్సీలు ఉంటారన్నదానిపైనే… మండలి భవితవ్యం కూడా తేలిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close