జగన్ కానుక : చినజీయర్‌కు 40 ఎకరాలు..!

శాసమండలి రద్దు కోసం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి గురించి బయట పెట్టలేదు కానీ.. అందులో ఓ కీలక నిర్ణయం.. విజయవాడలో చినజీయర్ ట్రస్ట్‌కు 40ఎకరాలు కేటాయించాలని నిర్ణయించడం. విజయవాడలో ఈ భూములు కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణయం గురించి ప్రభుత్వం పెద్దగా బయటకు రానివ్వలేదు. ఎంత మొత్తానికి.. కేటాయిస్తున్నారు. ఏ అవసరాలకు కేటాయిస్తున్నారన్నదానిపై స్పష్టత లేదు. కానీ చినజీయర్ ట్రస్ట్‌కు మాత్రం 40 ఎకరాలు కేటాయించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

చినజీయర్ స్వామికి.. సీతానగరం వద్ద ఓ ఆశ్రమం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు.. గురువు లాంటి చినజీయర్ స్వామి.. సహజంగానే.. జగన్‌కు కూడా.. ఆప్తుడిగా మారారు. ఎన్నికలకు ముందు పలుమార్లు చినజీయర్ ను కలిసి.. జగన్ ఆశీస్సులు తీసుకున్నారు కూడా. ప్రభుత్వం ఇప్పటి వరకూ.. స్వామిజీలకు.. భూములు కేటాయించిన చరిత్ర లేదు. తెలంగాణ సర్కార్ మాత్రం.. స్వరూపానందకు.. చినజీయర్ ట్రస్ట్ కు ఇటీవలి కాలంలో భూములు కేటాయించింది. ఆ క్రమంలో.. జగన్మోహన్ రెడ్డి కూడా చినజీయర్‌ ట్రస్ట్‌కు 40 ఎకరాలు కేటాయించారు. విజయవాడ శివార్లలో అయినా ఎకరం నాలుగైదు కోట్లకు తక్కువ కాకుండా ఉంటుంది. మరి ఎంత మొత్తానికి ఈ భూములు కేటాయించారో తెలియాల్సి ఉంది.

సాధారణంగా ప్రజాప్రయోజనాలు .. పరిశ్రమలు ఇలాంటి వాటికి మాత్రమే ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. ఇప్పుడు స్వామిజీలకు కూడా.. కేటాయించడం ప్రారంభమయింది. స్వరూపానంద కూడా… కృష్ణానది ఒడ్డున ఓ పెద్ద ఆశ్రమం కట్టుకోవడానికి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. బహుశా… చిరజీయర్ కు మొక్కు తీర్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి.. స్వరూపానందకు కూడా ప్రభుత్వ స్థలాలను కాకుకగా ఇస్తారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close