వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌… రిలీజ్ ముందు టెన్ష‌న్‌!

సినిమా రిలీజ్ అంటే హీరో అభిమానుల‌కు ఎలా ఉంటుందో తెలీదు గానీ, నిర్మాత‌ల‌కు మాత్రం గుండె గుబేలుమంటుంది. అది కూడా రేపు రిలీజ్ అన‌గా… ఈ రోజు రాత్రి టెన్ష‌న్ మొద‌లవుతుంది. అడ్వాన్సులు ఇచ్చేవాళ్లు, పాత బాకీలు, క్లియ‌రెన్సులూ అన్నీ 24 గంట‌ల ముందే. ఓ ర‌కంగా నిర్మాత‌ల‌కు ఇది పురిటినొప్పుల స‌మ‌యం అనుకోవాలి.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కూడా ఇలాంటి పురిటి నొప్పుల‌నే అనుభ‌విస్తోంది ఇప్పుడు. కె.ఎస్‌.రామారావు నిర్మించిన సినిమా ఇది. బిజినెస్ హ్యాపీగానే జ‌రిగింది. అయితే పాత సినిమాల‌కు సంబంధించిన బాకీలు ఇప్పుడు ఈ సినిమాని టెన్ష‌న్ పెడుతున్నాయి. కె.ఎస్‌.రామారావుకి దాదాపు పాతిక కోట్ల వ‌ర‌కూ అప్పులున్నాయ‌ని టాక్‌. వాటికి సంబంధించిన క్లియ‌రెన్సులు కోసం బ‌య్య‌ర్లు ఇప్పుడు కె.ఎస్‌.రామారావు మీద ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఫైనాన్సియ‌ర్ స‌త్తు రంగ‌య్య ఇంట్లో సెటిల్‌మెంట్ వ్య‌వ‌హారాలు సాగుతున్నాయి. ఇవ‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తే త‌ప్ప‌.. ఈ సినిమాకి క్లియ‌రెన్స్ దొర‌కదు. ఏ క్ష‌ణంలో ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనే వాతార‌వ‌ణం నెల‌కొందిప్పుడు. ఏదోలా పాత బాకీలు కొన్ని తీర్చేసి, కొంత‌మందికి స‌ర్దిచెప్పి ఈ సినిమాని బ‌య‌ట‌ప‌డేయాల‌ని కె.ఎస్‌.రామారావు భావిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close