స్టేట్ మొత్తం “సిట్” చేతుల్లోకి..!

ఎక్కడైనా ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగితే.. అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా.. అని.. పోలీసులు కొలతలు వేసుకుని రంగంలోకి దిగడం.. చాలా సినిమాల్లో చూసి ఉంటాం. ఇలాంటి పరిస్థితులు.. చాలా సార్లు వివాదాలుగా మారాయి. దిశ ఘటన తర్వాత మరింత ఎక్కువయ్యాయి. అందుకే.. జీరో ఎఫ్ఐఆర్ అనే విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇలాంటి బాదరబందీలు ఏమీ లేకుండా.. ఏపీలో.. ఓ కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటయింది. ఆ పోలీస్ స్టేషన్‌కు .. రాష్ట్రమే సరిహద్దులు. పోలీసు వ్యవస్థ మొత్తం అధికారాలు ఆ పోలీస్ స్టేషన్ గుప్పిట్లో ఉంటాయి. ఆ పోలీస్ స్టేషన్ మరేదో కాదు.. ఏపీ సర్కార్.. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ పోలీస్ స్టేషన్.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు జరిగిన ప్రతి విషయాన్ని పరిశీలించి.. తప్పులుంటే… కేసులు పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్‌ .. ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, మరో ముగ్గురు డీఎస్పీలు, సీఐలతో మొత్తం 10 మంది సభ్యులు ఈ సిట్‌లో ఉంటారు. దీనికి సంబంధించి జీవో జారీ చేసిన ప్రభుత్వం.. ఈ సిట్ కు పోలీస్ స్టేషన్ హోదా తో పాటు .. రాష్ట్రం మొత్తం పరిధిగా నిర్ణయించింది. గతంలో మంత్రివర్గ ఉపసంఘం.. సీఐడీ.. విజిలెన్స్.. ఇలా పలు రకాల విచారణ సంస్థలు.. అనేక రకాల అవినీతి జరిగిందనే లీకులు మీడియాకు ఇచ్చాయి.

ప్రస్తుతం సిట్ బృందం ఈ నివేదికలన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకోనుంది. అవసరం అయితే.. ఈ సిట్ కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కూడా సమన్వయం చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఏ అధికారినైనా, ఏ వ్యక్తినైనా సిట్ పిలిపించి ప్రశ్నించవచ్చని.. కేసులు పెట్టవచ్చని.. నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కక్ష సాధింపుల కోసమే.. ఇదంతా ప్రభుత్వం చేస్తోందని ఆరోపణలు వస్తున్న సమయంలో.. సిట్‌కు సర్వాధికారాలు కేటాయిస్తూ.. నిర్ణయం తీసుకోవడం.. ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close