ఏ క్షణమైనా టీవీ5 మూర్తి అరెస్ట్..!?

మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసహనం అరెస్టులకు తెగబడుతోందా..? తప్పులు ఎత్తి చూపిస్తే కేసులు పెట్టేందుకూ వెనుకాడటం లేదా..? టీవీ5 జర్నలిస్ట్ మూర్తిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని బుధవారం సాయంత్రం సీఐడీ వర్గాల నుంచి మీడియాకు లీక్ వచ్చింది. మూర్తి చర్చా కార్యక్రమాలు అన్నీ.. అగ్రెసివ్‌గా ఉంటాయి కానీ.. దానికే అరెస్ట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఏం కేసు పెట్టారు..? ఎందుకు పెట్టారు..? లాంటి విషయాలేమీ పెద్దగా బయటకు రాలేదు. కానీ మూడు ప్రత్యేక బృందాలు ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నాయని మాత్రం మీడియాకు సమాచారం అందింది. ఇదే విషయాన్ని టీవీ5 యాజమాన్యానికి కూడా సీఐడీ పోలీసులు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇంతకి జర్నలిస్ట్ మూర్తి చేసిన నేరం ఏమిటో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం ఇటీవలి కాలంలో వైరస్ విషయంలో ప్రభుత్వం చెప్పింది మాత్రమే ప్రజలకు వివరించాలని… ఇంకేమైనా చెబితే… విపత్తుల నిర్వహణ కింద కేసులు పెడతామని హెచ్చరిస్తూ వస్తోంది. బహుశా.. మూర్తి నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో.. ఏదైనా.. అంశంపై.. ఆయన ప్రభుత్వం ప్రకటించని సమాచారాన్ని చెప్పి ఉంటారేమోనని.. ఆయనను అరెస్ట్ చేయడానికి దానినో అవకాశంగా మల్చుకుని ఉంటారని భావిస్తున్నారు. ఆయనపై పెట్టిన కేసులేమిటో.. బయటకు చెప్పిన తర్వాతే.. అసలేం తప్పు జరిగిందో తెలుస్తుంది. నిజానికి బుధవారం రాత్రే… మూర్తిని అరెస్ట్ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం అసహనానికి గురవుతోందంని… గతంలో… సాక్షి మీడియా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవాలని మీడియా వర్గాలు పోస్టులు పెట్టడం ప్రారంభించాయి.

ప్రభుత్వానికి టీవీ5 మూర్తి చాలా కాలంగా ఇబ్బందికరంగా మారారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయంపై అండగా నిలబడ్డారు. ప్రజలకు నష్టం కలిగించే ప్రతీ నిర్ణయాన్ని తన చర్చా కార్యక్రమాల్లో చర్చించారు. తప్పొప్పులు బయటపెట్టారు. ఆయనపై వైసీపీ సోషల్ మీడియా చాలా తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసింది. ఇప్పుడు వాటన్నింటికీ అరెస్ట్‌తో లెక్క తేల్చుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లుగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close