ఆర్కే పలుకు : పోతిరెడ్డిపాడు డైవర్షన్ రాజకీయమే..!

ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో పోతిరెడ్డిపాడు వివాదంపై తనదైన విశ్లేషణ చేశారు. రాజకీయ నాయకులు ఓ సమస్యను మరుగుపర్చడానికి మరో సమస్యను తెరపైకి తెస్తారని..ఆ వ్యూహంలో భాగంగా… ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటనను నుంచి దృష్టి మళ్లించడానికే… పోతిరెడ్డిపాడు జీవోను ఏపీ సర్కార్ విడుదల చేసిందని.. ఆయన విశ్లేషించారు. ఇదంతా జగన్‌కు మిత్రునిగా ఉన్న కేసీఆర్ కు తెలియకుండా జరిగి ఉండదనేది.. ఆయన కథనంలోని సారాంశం. అంతే కాదు.. అసలు ఇప్పటికిప్పుడు పోతిరెడ్డిపాడును విస్తరించినా.. రాయలసీమకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని లెక్కలతో వివరించారు. కాలువలు పెద్దవి చేసి… ఎత్తిపోసుకున్నా… రాయలసీమలో నిల్వ చేసుకునే రిజర్వాయర్ల సామర్థ్యం లేదని ఆయన చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును రాజకీయంగా ఉపయోగించుకుంటోందని అనడానికి మరికొన్ని ఉదాహరణను ఆర్కే వెల్లడించారు. రాయలసీమకు నిజంగా నీళ్లు ఇవ్వాలి అనుకుంటే.. చడీచప్పుడు కాకుండా ఎత్తిపోతలను పూర్తి చేయాల్సిందన్నారు. ముచ్చుముర్రిని చంద్రబాబు ఎలా పూర్తి చేశారో తెలియదా అని ప్రశ్నించారు. అంతే కాకుండా…వివాదాస్పద జీవోను అలా బహిరంగంగా విడుదల చేయడానికి కారణం ఏమిటని కూడా ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. తమకు అవసరమైన జీవోలు సీక్రెట్‌గా విడుదల చేస్తున్నారుకదా.. అని ప్రశ్నిస్తున్నారు. కరువు- కాటకాలతో అల్లాడిపోతున్న రాయలసీమ ప్రజల్లో భావోద్వేగాలు పెంపొందించి రాజకీయ ప్రయోజనం పొందడం ఆ ప్రాంత నాయకులకు అలవాటుగా మారిపోయిందని ఆర్కే తేల్చేశారు.

కరెంట్ చార్జీల పెంపుపై కూడా ఆర్కే జగన్ తీరును సునిశితంగా విమర్శించారు. ప్రమాణస్వీకారం సమయంలో అన్నింటినీ తగ్గించేస్తానని జగన్ ప్రకటనను గుర్తు చేశారు. ఏడాది కాకుండానే మోయలేనంతగా భారం మోపారని ఆర్కే ఆక్షేపించారు. మద్యం విషయంలో జగన్ సర్కార్ వాదనను హైలెట్ చేస్తూ.. వినియోగాన్ని తగ్గించడానికే రేట్లు పెంచుతున్నారనే వాదనను… ఇక వినిపిస్తారని.. సెటైర్లు వేశారు. గత వారం… జగ్మోహన్ రెడ్డికి కాస్త అనుకూలంగా ఆర్టికల్ రాశారు. ఆయన రాజకీయ వ్యహాలతో ఓటు బ్యాంక్‌ను సుస్థిరం చేసుకుంటున్నాని రాశారు. దీంతో ఆర్కే ఎందుకు అలా మారారన్నప్రశ్నలు వచ్చాయి. దానికి కూడా.. ఆయన తన కథనంలో వివరణ ఇచ్చారు. తాను రాసిన దాంట్లో అర్థం స్పష్టంగా ఉందని.. అర్థం చేసుకున్న వారు చేసుకున్నారు.. లేని వారు లేదని చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close