బీజేపీ ఏం చేసిందని పవన్ బాకా ఊదుతున్నారు..?

భారతీయ జనతా పార్టీ ఎం చేసినా.. పొగుడుతూ.. ప్రెస్‌నోట్లు విడుదల చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ పొత్తు స్నేహితులు కమ్యూనిస్టులు మండి పడుతున్నారు. ఏపీకి బీజేపీ ఏం చేసిందని పవన్‌ పొగుడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పవన్ కల్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. బీజేపీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిందా?.. విభజన హామీలు కనీస మాత్రమైనా అమలు చేసిందా..? అమరావతి రాజధాని నిర్మాణానికి ఏమైనా చేసిందా? అని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. కేంద్రం చర్యలకు పవన్ కల్యాణ్ అదే పనిగా బాకా ఊదుతూ … జనసేన శ్రేణులు కూడా బీజేపీకి ప్రచారం చేయాలని సూచించడం… బీజేపీ పెళ్లికి జనసేన మేళంలా ఉందని రామకృష్ణ సెటైర్ వేశారు.

పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో కేంద్ర బీజేపీని.. ఆ పార్టీ నిర్ణయాలను అదే పనిగా సమర్థిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా.. తన స్పందనను.. తెలియచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన ఏపీ ప్రయోజనాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శ వినిపిస్తోంది. అమరావతి విషయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు… అమరావతి రాజధానిగా మారదన్న హామీతోనే.. తాను పొత్తు పెట్టుకున్నానని.. పవన్ చెప్పారు. అనూహ్యంగా తర్వాత అమరావతి విషయంలో సైలెంటయిపోయారు.

ఏపీకి సంబంధించిన ఇతర అంశాలపైనా పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ.. బీజేపీని పొగిడే విషయంలో మాత్రం ఎక్కడా తేడా రానీయడం లేదు. గత ఎన్నికల్లో తమతో కలిసి పని చేసి.. ఓడిపోయిన వెంటనే… ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. పవన్ బీజేపీ పంచన చేరడంతో.. కమ్యూనిస్టులు అప్పటి నుంచి జనసేన అంటే మండిపడుతున్నారు. ఆ అసహనాన్ని రామకృష్ణ మరోసారి బయట పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close