విజయసాయిరెడ్డి నీళ్లు నమిలిన ప్రశ్న..!

రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం చెప్పుకోలేని ప్రశ్నలను ఎదుర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు లాగానే.. సొంత పార్టీని విమర్శిస్తూ.. జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో.. అదే న్యాయం ఎందుకు పాటించడం లేదనే ప్రశ్నలు మీడియా ప్రతినిధుల నుంచి దూసుకొచ్చాయి. దానికి విజయసాయిరెడ్డికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ ఎమ్మెల్యేలు ఎవరూ .. తమ పార్టీలో చేరలేదని కవర్ చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేలకు చెందిన పార్టీ అధ్యక్షుడ్ని అడగాలంటూ.. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మరోసారి అదే ప్రశ్న అడిగితే.. సమాధానం చెప్పడానికి నిరాకరించారు.

తాను చేస్తే రాజకీయం… ఇతరులు చేస్తే మాత్రం నైతిక విలువలకు విరుద్ధమన్నట్లుగా వైసీపీ తీరు ఉందని..విజయసాయిరెడ్డి స్పందనతోనే తేలిపోయిందన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే.. నీతి వాక్యాలు చెప్పే పార్టీగా ప్రస్తుతం వైసీపీ నిలిచింది. అధికారంలో ఉంటే.. తమను ఎవరు ధిక్కరించరని.. వైసీపీ నేతలు అనుకోని ఉండవచ్చు కానీ… రఘురామకృష్ణంరాజు లాంటి నేతలు.. ఉంటారని.. అంచనా వేయలేకపోయింది. ఫలితంగా.. ఏడాది కాక ముందే.. తాము ప్రతిపక్ష పార్టీపై పన్నిన వ్యూహం.. తమకే రివర్స్ అయింది. దాంతో.. అనర్హతా వేటు అంటూ.. వైసీపీ నేతలు ఢిల్లీకి పరుగులు పెట్టారు. ఇలాంటి సమయంలో..తాము చేసిన పనులు కూడా అలాంటివేనన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ పడిపోయింది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను .. వివిధ రకాలుగా ఆ పార్టీకి దూరం చేయడమే కాకుండా.. వారితో.. టీడీపీని నానా రకాలుగా విమర్శింప చేస్తూ ఉంటారు వైసీపీ నేతలు. వైసీపీ బ్రాండ్ తిట్లను.. టీడీపీ అధినేతపై కూడా ప్రయోగించేలా చేస్తూంటారన్న విమర్శలు ఉన్నాయి. వారిని తమ పార్టీ గ్రిప్‌లో ఉంచుకుని..కాపాడుతూ.. ఇప్పుడు.. అదే తరహాలో కాకుండా.. కాస్త గౌరవంగా… వ్యాఖ్యలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం.. వైసీపీ నీతులు చెబుతోంది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే అని.. టీడీపీ నేతలు సెటైర్లు ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close