హీరోయిన్ ద‌ర్శ‌క‌త్వం

హీరోల‌కు ద‌ర్శ‌కులుగా మారాల‌ని ఉంటుంది. ఎందుకంటే.. చాలా వ‌ర‌కూ.. స‌హాయ ద‌ర్శ‌కులుగా ప‌నిచేసి వ‌చ్చిన‌వాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. క‌థ‌ల విష‌యంలో వాళ్ల‌కు ప‌ట్టుఉంటుంది. అందుకే.. ఒక్క‌సారైనా మెగాఫోన్ ప‌ట్టాల‌ని అనుకుంటారు. క‌థానాయిక‌లు అలా కాదు. వ‌చ్చామా? డ‌బ్బులు సంపాదించుకున్నామా? వెళ్లిపోయామా? అనుకుంటారు. క‌నీసం.. ప్రొడ‌క్ష‌న్‌లో కూడా దిగ‌రు. అది ఇంకా రిస్క్ అని వాళ్ల‌కు తెలుసు. కానీ.. కొంత‌మంది క‌థానాయిక‌లు అలా కాదు. మ‌న‌సులో `ద‌ర్శ‌క‌త్వ‌` ఆలోచ‌న బ‌లంగా ముద్ర వేసుకుని ఉంటుంది. నిత్య‌మీన‌న్ కి మెగాఫోన్ ప‌ట్టాల‌ని క‌ల‌. అందుకు ప్లానింగ్ కూడా చేస్తోంది.

ఇప్పుడు అదే బాట‌లో నివేదా థామ‌స్ ప‌య‌నించ‌బోతోంది. నిన్నుకోరి, జెంటిల్‌మెన్ లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకుంది నివేదా. ఇప్పుడు.. `వి`లోనూ నటించింది. త్వ‌ర‌లోనే దర్శ‌క‌త్వం వ‌హించాల‌ని భావిస్తోంద‌ట‌. “ద‌ర్శ‌క‌త్వం అన్న‌ది నా క‌ల‌. ఎప్ప‌టికైనా మెగాఫోన్ ప‌డ‌తాను. అందులోని మెళ‌కువ‌ల‌పై దృష్టి పెడుతున్నా“ అంటోంది నివేదా. కాక‌పోతే మ‌రో రెండు మూడేళ్లు కేవ‌లం న‌టన‌పైనే దృష్టి పెట్టాల‌నుకుంటోంద‌ట‌. ఆ త‌ర‌వాతే కెప్టెన్ కుర్చీలో కూర్చుంటుంద‌ట‌. మ‌రి… నివేదా ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఎలా ఉంటుందో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నార్త్ కు మోడీ ప్రాధాన్యత…దక్షిణాదిలో బీజేపీకి ఓట్లు రాలేనా..?

మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శలున్నాయి. బడ్జెట్ కేటాయింపులు , కేంద్ర మంత్రివర్గ శాఖలు.. ఇలా ఎలా చూసినా నార్త్...

ఓటేస్తున్నారా ? : బోడిగుండుగా మారిన రుషికొండను గుర్తు చేసుకోండి !

చంద్రబాబు హయాంలో ఐదు వందల కోట్లు పెట్టి సచివాలయ భవనాలు, అసెంబ్లీని నిర్మించారు. అవి ట్రాన్సిట్ భవనాలు. ఐకాన్ బిల్డింగ్స్ కట్టడానికి పునాదులు వేసే సరికి జగన్ వచ్చి కూర్చున్నారు. ఈ ఐదేళ్లలో...

ఇక నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ బంద్… ఎందుకంటే..?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇక నుంచి టీకాను ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన టీకాలు అందుబాటులోకి వచ్చినందున ఇక తమ వ్యాక్సిన్ అవసరం లేదని...

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close