పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించారు. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జులై జీతాల్లో చెల్లిస్తారు. జులై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లిస్తారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.

అయితే ఆరు నెలల తేడాతో డీఎలు అమలు చేయడంతో.. ఆ తర్వాత ఇవ్వాల్సిన డీఎలను వాయిదా వేస్తారన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో ఏర్పడుతోంది. ఇవ్వాల్సిన డీఎలను ఇలా.. ఆరు నెలలకోసారి ఇస్తామని చెప్పడం ద్వారా.. కొత్తగా ఇవ్వాల్సిన డీఏలకు టెండర్ పెట్టేశారని విమర్శలు వినిపిస్తన్నాయి. పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకే సారి అమలు చేస్తారని చాలా మంది ఉద్యోగులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఎప్పట్లాగే కొత్తగా ఆలోచించింది.

కరోనా పేరుతో కత్తిరించిన జీతాలను కూడా ప్రభుత్వం ఇచ్చుకుంటూ పోవాలని నిర్ణయించింది. రెండు నెలల పాటు సగం సగం జీత కోత విధించిన దాన్ని ఐదు విడుతలుగా ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్ నుంచే వాయిదా జీతాలు చెల్లిస్తామని ప్రకటించించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ జీతం చెల్లిస్తారు. డీఏలను 2022 వరకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పుడు జీతాలను ఐదు నెలల పాటు ఇచ్చుకుంటూ పోవాలని నిర్ణయించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close