టీకా వచ్చే సరికి అవసరం లేనోళ్లు ఎక్కువగా ఉంటారట..!

కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచం మొత్తం చర్చ జరుగుతోంది. ఫైజర్ కంపెనీ తమ టీకా 90 శాతం ఫలితాలిస్తోందని ప్రకటించగానే… ప్రపంచం మొత్తం హెడ్ లైన్స్ అయింది. తర్వాత రష్యా.. తమ స్కోర్ 92 శాతం సమర్థత అని చెప్పుకుంది. ఇంకా చాలా  ఫార్మా కంపెనీలు తమ టీకాను… తుది దశ పరీక్షలకు పంపాయి. ఆ రిజల్ట్స్ రావాల్సి ఉంది . మరో వైపు దేశాలకు దేశాలు.. టీకా పంపిణీకి ఏర్పాట్లు చేసుకుటున్నాయి. భారత్ లాంటి దేశాల్లో కోట్లకు కోట్ల డోసులు రెడీగా ఉన్నాయని ప్రాధాన్యతలు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సమాచారం కూడా పంపారు. అయితే..  టీకా పూర్తి అందుబాటులోకి వచ్చే సరికి.. దాని అవసరం లేని వాళ్లే ఎక్కువగా ఉంటారని తాజాగా నిపుణులు చెబుతున్నారు.

సీరో సర్వైలెన్స్ సర్వే ద్వారా.. అసలు కరోనా ఎంత మందికి సోకిందన్న విషయంపై పరిశోధన చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే సగం మందికిపైగా కరోనా సోకి… తగ్గిపోయిందని… వారిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ప్రకటించారు. అది ఇంకా పెరుగుతోంది. కొన్నాళ్ల తర్వాత అది 70, 80 శాతం మందికి చేరుతుంది. కొంత మందికి కరోనా సోకకుండానే యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతున్నాయని గుర్తించారు. అంటే.. ఓ రకంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లే.   వైరస్ సోకినప్పుడు మనిషి దాన్ని తట్టుకోగలిగితే… ఆటోమేటిక్‌గా అతనిలో దాన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం వైరస్ ఆరేళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారికి సోకినా ప్రభావం తక్కువే ఉంటోంది. అరేళ్లలోపు.. అరవయ్యేళ్ల పైబడిన వారిని మాత్రం జాగ్రత్తగా ఉంచి మగిలిన వారందర్నీ.. అలా వదిలేయడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ దశ వచ్చేస్తుందని పలు దేశాలు నమ్ముతున్నాయి.

హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే… జనాభాలో 60 శాతం మందికి వైరస్ వచ్చి ఉండాలి.   మన జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి. అప్పుడు ఆ జనాభా అంతటికీ ఇమ్యూనిటీ వచ్చిందని అనుకోవచ్చు. అంటే..  హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించినట్లే. ఇలా ఒక ప్రాంతంలోని సమూహానికి ఇమ్యూనిటీ వచ్చినప్పుడు.. మళ్లీ వైరస్‌ దాడి చేసినా నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఈ హెర్డ్ ఇమ్యూనిటీ దగ్గరకు ఇండియా వచ్చిందని.. తర్వాత టీకా వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా అటు జనాల్ని.. ఇటు ప్రజల్ని ఓ ఆట ఆడేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close