అభివృద్ధిలో అస్సాం ఫస్ట్.. ఏపీ సెకండ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే సర్వేలో మరోసారి వెల్లడయింది. వివిధ అంశాల ప్రాతిపదికగా సమాచారాన్ని సేకరించి.. ఇండియా టుడే స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ పేరతో గణాంకాలను ప్రతీ ఏడాది ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా ప్రకటించింది. పెద్దరాష్ట్రాల్ల్లో మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. అస్సాం మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా అస్సాం మొదటి స్థానంలో నిలించింది. ఏపీ కూడా గత ఏడాది రెండో స్థానంలో నిలిచింది. కానీ టీడీపీ హయాంలో 2018లో మాత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంటే వైసీపీ సర్కార్ వచ్చిన ఏడాదికే ఏపీ రెండో స్థానానికి చేరింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది.

కరోనా కట్టడి విషయంలోనూ అస్సాం .. అద్దిరిపోయే ప్రదర్శన చేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమీ తక్కువ కాదు. మూడో స్థానంలో నిలిచింది. అయితే కరోనా కట్టడి దేశం మొత్తం తమ వైపు చూస్తుందని వైసీపీనేతలన్నారు కానీ.. అస్సాం వైపు చూసినట్లుగా తెలుస్తోంది. మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌ బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి వచ్చింది.

మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌తో కలిసి ఇండియా టుడే సంస్థ ఈ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. మొత్తం పన్నెండు కీలక రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని.. వివిధ మార్గాల్లో సేకరించిన డేటాతో పరిశీలించి.. ర్యాంకులు ఇస్తుంది. 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్‌ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ చూస్తూ ర్యాంకులు ఇస్తుంది. ఇందులో ఏపీ దూసుకెళ్తోందని గత ఏడాది నుంచి చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close