వైసిపి కార్యకర్తల చేతిలో పోలీసులకి మసాజ్ !

విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆఫీసుపైకి వెళ్లిన వైసీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి తెగబడటం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అక్కడ పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దురుసుగా వ్యవహరించారు. రామకృష్ణబాబు కార్యాలయంపై దాడి చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్న పోలీసులపై ఎదురుదాడి చేశారు. ఆ దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైసీపీ కార్యకర్తలు హద్దులు దాటిపోతున్నారని పోలీసుల్ని లెక్క చేయడం లేదన్న విమర్శలు వచ్చాయి. అయితే అనూహ్యంగా.. ఏపీ పోలీసు శాఖ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో దీనిపై స్పందించింది. పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయలేదని.. పోలీసు కింద పడితే పైకి లేపి మసాజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోలీసులు ఇచ్చిన వివరణ చూసి.. సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయింది. అసలు వెలగపూడి రామకృష్ణబాబు ఆఫీసు దగ్గర ఏం జరిగిందో.. మొత్తం వీడియోల్ని పోస్ట్ చేయడం ప్రారంభించారు. టీడీపీ నేత నారా లోకేష్ కూడా .. పోలీసుల్ని నెట్టేస్తున్న వైసీపీ కార్యకర్తల వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో తన్నించుకుని… బాడీ మసాజ్ చేయించుకున్నామని చెప్పుకోవడం ఏమిటని.. మళ్లీ దానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో… సమర్థించుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ల దగ్గర పెట్టవద్దని ఆయన సూచించారు.

కొద్ది రోజుల క్రితం.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని పొన్నూరులో దళిత టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో నారా లోకేష్‌ పోలీసులపై మండిపడ్డారు. అప్పుడు కూడా గుంటూరు అర్బన్ ఎస్పీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని ప్రకటించారు. తర్వాత పోలీస్ స్టేషన్ సీసీ విజువల్స్ బయట పెట్టాలనిలోకేష్ సవాల్ చేశారు. తర్వాత పోలీసులు మాట మార్చారు. ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని చెప్పారు. అప్పుడే పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు.. తమపై దాడి చేసినా.. మసాజ్ చేశారని చెప్పుకుంటూ.. పోలీసుల అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్.. వైరల్‌గా మారింది. ఇక వైసీపీ నేతలు ఏం చేసినా.. మసాజ్ చేశారని సరి పెట్టుకుంటారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేందయా ఇది- కిషన్ రెడ్డిపై కంప్లైంట్..!

కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్...

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close