బీజేపీ-జనసేన గెలిస్తే సోము చాయిస్ బీసీ సీఎం..! పవన్ కల్యాణ్ కాదా..?

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. బీజేపీ -జనసేన పొత్తు పెట్టుకున్న కొత్తలో అధికారంలోకి వస్తే పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అన్నట్లుగా సోము వీర్రాజు ప్రకటనలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. కానీ.. ఇటీవలి కాలంలో సోము వీర్రాజునే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ సోషల్ మీడియా టీం పేజీలు క్రియేట్ చేసింది. సోమువీర్రాజు ఫర్ సీఎం పేరుతో కొన్ని సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో సోము వీర్రాజు హఠాత్తుగా బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థినే సీఎం చేస్తామని ప్రకటించేశారు.

బహుశా.. తనను లేదా పవన్ కల్యాణ్‌ను ఆయన బీసీగా భావిస్తున్నారేమోనన్న చర్చ ఇప్పుడు ప్రారంభమయింది. అయితే ఏ వర్గం ఓటు బ్యాంక్ లేక.. చిక్కి శల్యమైపోతున్న బీజేపీకి బీసీ వర్గాల ఓటు బ్యాంక్ ను ఆకట్టుకోవడం కోసం ఇలాంటి ప్రకటన చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. సోము వీర్రాజు ప్రకటనపై వైసీపీ, టీడీపీ నేతలు స్పందించారు. వైసీపీ ఎలక్షన్ జిమ్మిక్ అని చెబుతూండగా.. టీడీపీ మాత్రం… ముందు సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేసి.. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలని సూచించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు బీసీగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలను కేంద్రం కల్పించకపోగా… ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా పూర్తి స్థాయిలో అమ్మేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో చర్చ జరుగుతున్న సమయంలో… సోము వీర్రాజు బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా.. తమ పార్టీలోకి నేతలు వచ్చేందుకు పరుగులు పెడుతున్నారని సోము చెప్పుకుంటున్నారు. మొత్తానికి సోము ప్రకటన .. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close