పింక్ బాల్ టెస్ట్ : భారత్ స్పిన్‌కు ఇంగ్లాండ్ గింగరాలు.. 112కే ఆలౌట్..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరు మీద ప్రారంభమైన అహ్మదాబాద్ కొత్త స్టేడియంలో స్పిన్ గింగరాలు తిరిగింది. ఈ దెబ్బకు మొదటి రోజే.. గట్టిగా యాభై ఓవర్లు కూడా ఆడలేక కుప్పకూలిపోయింది. 48.4 ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు 112 పరుగులకు ఆలౌటయ్యారు. అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. తర్వాత అశ్విన్ మూడు వికెట్లు తీశారు. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎదురుదాడి చేయలేకపోయారు. టాస్ గెల్చిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం వ్యూహాత్మక తప్పిదమని ఇన్నింగ్స్ ప్రారంభమంలోనే తేలిపోయింది.

పరుగులు రావడం కష్టమవడం మాత్రమే కాదు.. బాల్ కూడా విపరీతంగా టర్న్ అవడం ప్రారంభించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 112 పరుగుల్లో 53 పరుగుల ఓపెనర్ క్రావ్లీ చేశాడు. ఆరు ఎక్స్‌ట్రాలు వచ్చాయి. మిగతా మిగతా పది మంది కలిపి 53 పరుగులు చేయలేకపోయారు. మూడో టెస్టు మ్యాచ్ డే అండ్ నైట్ పద్దతిలో సాగుతోంది. పింక్ బాల్‌తో సాగే ఈ టెస్టుపై మొదటి నుంచి ఆసక్తి ఏర్పడింది. నూతనంగా నిర్మించిన అతి పెద్ద స్టేడియంలో… అత్యాధునికమైన ఫ్లడ్ లైట్స్ వెలుతురులో ఇండియా ఇన్నింగ్స్ కొనసాగనుంది.

మొదట్లో స్పిన్‌కు అనుకూలించినా రాను రాను బ్యాటింగ్ అనుకూలంగా మారుతుందని స్పిన్ స్వభావాన్ని అంనచా వేయలేకపోయిన ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్నారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. భారత్ ఆటగాళ్లు.. ఒకరిద్దరు నిలబడితే… భార్త విజయం సునాయాసమయ్యే అవకాశం ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ , ఇంగ్లాండ్ చెరో మ్యాచ్ గెలుపుతో సమానంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close