20 నెలల్లో సాక్షికి రూ.వంద కోట్ల ప్రజాధనం సమర్పణ..!

విజయ్ కుమార్ రెడ్డి అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని… ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే డిప్యూటేషన్ మీద తీసుకొచ్చారు. ఆయన పదవీ కాలం రెండేళ్లలో ముగుస్తున్న సమయంలో.. మరో మూడేళ్ల పొడిగింపు తీసుకొచ్చారు. మరో మూడేళ్లు ఆయనే కొనసాగుతారు. ఈ విజయ్ కుమార్ రెడ్డి… విచ్చలవిడిగా…. నిబంధనల్లాంటివేమీ పట్టించుకోకుండా…. జగన్ సొంత మీడియాకు… ప్రకటనల వరద పారిస్తున్నారు. సమాచారశాఖ కిందనే…. సాక్షి మీడియాకు ఇరవై నెలల్లో రూ. వంద కోట్లకుపైగా ప్రకటనలు వెళ్లినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రజాధనం పట్ల కాస్త గౌరవం ఉన్న ముఖ్యమంత్రి అయినా… అధికార దుర్వినియోగం చేయకూడదనే వెరపు ఉండే సీఎం అయినా… తాను సీఎంగా ఉండి.. తన సంస్థకు ప్రభుత్వం తరపున మేళ్లు చేయడం ..తప్పు అనే అభిప్రాయం ఉన్న వారైనా… కాస్త ఆలోచిస్తారు. కానీ ముఖ్యమంత్రి జగన్ అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోరని…తేలిపోతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మే 2019 నుండి ఈ ఏడాది జనరవరి వరకూ ఒక్క సాక్షి పత్రికకు ప్రభుత్వం తరపు నుంచి చెల్లించిన మొత్తం అక్షరాలా 104 కోట్ల 75 లక్షల రూపాయలు. ఇది ఒక్క పత్రికకు మాత్రమే. ఇక టీవీతో పాటు డిజిటల్ మీడియాకు కూడా ప్రకటనలు ఇచ్చారు. ఎలా చూసినా ఇరవై నెలల్లో 110 కోట్లు వరకూ ప్రజాధనం సాక్షి ఖాతాలోకి వెళ్లిపోయింది.

సాధారణంగా పత్రికలకు ప్రకటనలు ఇవ్వడానికి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. వాటిని ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. సర్క్యూలేషన్ పరంగా రెండో స్థానంలో ఉన్న సాక్షికి అత్యధిక ప్రకటనలు ఇచ్చారు. వైసీపీకి మద్దతుగా వార్తలు రాసే చిన్నాచితకా పత్రికలకూ ప్రజాధనంతో ప్రకటనలు ఇచ్చారు. ప్రకటలన్నీ సొంత డబ్బా కోసమే.ఇసుకను ప్రైవేటుకు కట్టబెట్టడం పై వస్తున్న విమర్శలకు సమాధానాలకూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఇలా చేయడం అధికార దుర్వినియోగం అవుతుందన్న ఆలోచన కూడా.. ప్రభుత్వ పెద్దలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్న ఈ ప్రకటనలు.. చెల్లింపుల వల్ల భవిష్యత్‌లో అధికారులు ఇబ్బందులు పడతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ సమాచారం అంతా ఒక్క సమాచార, ప్రసారశాఖల ద్వారా వెళ్లిన ప్రకటనలు మాత్రమే. ఇంకా వేర్వేరు శాఖల ద్వారా పెద్ద ఎత్తున ప్రకటనలు… సాక్షి మీడియాకు వెళ్లాయి. అవి ఎంత భారీగా ఉంటాయో అంచనా వేయడం కష్టం.ప్రభుత్వం మారిన తర్వాత… ఈ అక్రమాలన్నీ బయటకు తీయాలనుకునే ప్రభుత్వం వస్తే అప్పుడు అసలు ప్రజాధనం ఎంత మేర సాక్షి ఖాతాల్లోకి వెళ్లిందో స్పష్టమవుతుందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close