కొంప ముంచిన సాగర్ సభ..!

నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం.. కరోనా హాట్ స్పాట్‌గా మారిపోయింది. సీఎం కేసీఆర్ సహా… టీఆర్ఎస్ ముఖ్య నేతలందరికీ ఆ సభ ద్వారానే కరోనా సోకినట్లుగా అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన బహిరంగంగా పాల్గొన్న కార్యక్రమం హాలియాలో ఏర్పాటు చేసిన సభ మాత్రమే. దాని ద్వారానే కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్నారు. ఇలా అనుకోవడానికి బలమైన కారణం.. ఆ సభలో పాల్గొన్న వారిలో చాలా మందికి పాజిటివ్ వచ్చింది.

పోలింగ్ ముగిసిన తర్వాత ప్రచారంలో పాల్గొన్న పలు పార్టీల నాయకులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంత మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్ ‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే టిఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య లకి కూడా కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలకూ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. పరిమితంగా ప్రచారం చేస్తున్నా కరోనా కేసులు మాత్రం వందల్లో నమోదవుతున్నాయి.

ఎన్నికల ప్రచారసభల్లో ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించరు. ఎన్నికల సంఘమూ పట్టించుకోదు. ప్రజలకు నీతులు చెప్పే రాజకీయ నేతలూ లైట్ తీసుకుంటారు. ఫలితంగా దేశంలో ఎన్నికల ప్రచారసభలు అలా జరిగిపోతున్నాయి. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోనూ ఎవరూ కరోనా నిబంధనలు పాటించలేదు. ఫలితంగా… కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

HOT NEWS

css.php
[X] Close
[X] Close