ఆయిల్ కంపెనీల “మస్కా” బయటపెట్టిన పవన్..!

సీఎస్ఆర్ నిధులన్నీ పీఎం కేర్స్‌కి.. సీఎంరిలీఫ్ ఫండ్‌కు పంపింగ్ చేస్తూంటే.. వాస్తవంగా ఆయా కార్పొరేట్ సంస్థలు ప్రజలకు చేయాల్సిన సేవ ఎలా చేస్తాయి..?. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా ఎత్తి చూపుతున్నారు. గోదావరి జిల్లాల్లోని కోనసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని ఆనేక సంస్థలు తోడుకుంటున్నాయి. వేల కోట్లు ఆర్జిస్తున్నాయి. కానీ కోనసీమ ప్రాంతానికి చేస్తున్న సాయం మాత్రం అంతంతమాత్రమే. చివరికి కోవిడ్ లాంటి సంక్షోభ సమయాల్లోనూ అదుకుంటున్న వారు లేరు. మొదటి విడత కరోనా వేవ్ సమయంలో… ఆయిల్ సంస్థ పెద్ద పెద్ద హామీలు ఇచ్చాయి.

కోనసీమలో రూ.200 కోట్లతో వైద్య వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. కానీ రెండో వేవ్ వచ్చినా వాటి పనుల ఊసు లేదు. ఫలితంగా ఇప్పుడు.. కోనసీమ ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. కనీసం అంబులెన్స్ సౌకర్యాలు కూడా లేవు. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం చెబుతున్నట్లుగా.. ఎక్కడా సౌకర్యాలు కనిపించడం లేదు., చనిపోతే లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. వైసీపీ ఎంపీలు మాట్లాడుకున్న వీడియోలోని మాటలే సాక్ష్యం. ఆయిల్ కంపెనీలు తమ సీఎస్ఆర్ ఫండ్స్‌తో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసినా ఇబ్బంది ఉండేది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అందుకే పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ లేఖ రాశారు. ఆయిల్ కంపెనీలు.. హామీ ఇచ్చిన మేరకు.. అమలు చేశాయో ఉన్నతాధికారులు తక్షణమే సమీక్షించి.. ఆ హామీ కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సంక్షోభం సమయంలో.. ప్రభుత్వాలు సీఎస్ఆర్ నిధులను.. పీఎంకేర్స్, సీఎంఆర్ఎఫ్‌లకు ఇస్తే సరిపోతుందని రూల్ మార్చారు. ఫలితంగా కంపెనీలు పేదల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు.. ప్రభుత్వ ఖాతాలోకే వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close