తప్పలేదు.. జరగని సమావేశ ఖర్చు రూ. కోటి 12 లక్షలు..!

పీటల మీద పెళ్లి ఆగిపోయినా ఖర్చు ఖర్చే. అసలు కార్యక్రమం ఆగిపోయిందనే బాధ ఒకటి.. ఆడంబరంగా పెట్టిన ఖర్చు అంతా వృధా అయిందనే బాధ మరొకటి… ఆ కుటుంబ పెద్దను మెలి పెడుతుంది. ఇలాంటి బాధను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అనుభవించారు. అసలు జీతాలకు నిధుల్లేక ఆర్బీఐ దగ్గర చాలా చాలా వడ్డీకి రుణాలు తెస్తూంటే.. ఆ సొమ్మును ఉపయోగించని వాటికి చెల్లించాల్సి రావడం ప్రభుత్వ పెద్దకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్బీఐ నుంచి అప్పు చేతికి అందిన తర్వాత అత్యవసరంగా చెల్లించాల్సిన వాటికి నిధులు మంజూరు చేశారు. వాటిలో తిరుపతిలో జరగకుండా ఆగిపోయిన ఓ సమావేశానికి సంబంధించి రూ. కోటి పన్నెండు లక్షల బిల్లును మంజూరు చేశారు. అంత ఖర్చు పెట్టి ఏం చేశారు.. ఇంతకీ ఆ సమావేశం ఏమిటి.. అన్న ఉత్సుకత చాలా మందిలో కనిపించింది.

మూడు నెలల కిందట.. తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగాల్సి ఉంది. అమిత్ షా ఆధ్వర్యంలో ఆ సమావేశం జరగాల్సి ఉంది. దీనికి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. కేంద్రహోంమంత్రితో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు కాబట్టి.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడానికి రూ. నాలుగు కోట్ల ఖర్చు అంచనా వేశారు. అవసరాలు చెప్పి.. కాంట్రాక్టర్‌కు పనులు ఇచ్చారు. ఆయన తన పని తాను చేశారు. కానీ చివరికి…అమిత్ షా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో సమావేశం రద్దయింది. కానీ.. చేసిన ఏర్పాట్లకు మాత్రం ఖర్చులయ్యాయి.

ఆ కాంట్రాక్టర్ వైసీపీ పెద్దలకు సన్నిహితుడుకావడంతో .. ఆయన తనకు రావాల్సిన బిల్లుల గురించి అదే పనిగా రిమైండర్లు పెట్టుకున్నారు. చివరికి కనికరించి ఆయనకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయనకు కోటి పన్నెండు లక్షలు విడుదల చేయాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి అసలు సమావేశం జరగలేదు కానీ… డబ్బులు మాత్రం పోయాయన్న ఆవేదన ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close