బీజేపీ నేతలతో వైసీపీ నేతల వరుస భేటీలు..! హైకమాండ్‌కు తెలిసేనా..?

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీ వెళ్లారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు మరికొంత మంది కేంద్రమంత్రుల్ని కలిశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. వైసీపీ ఎంపీలు అందరూ ఢిల్లీలో ఉండగా రాష్ట్ర సమస్యల కోసం అంటూ కోన రఘుపతి కేంద్రమంత్రుల్ని కలవడం… వైసీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒక వేళ అలా కలవాలనుకుంటే ఎంపీలందరూ వెళ్లి కలవొచ్చు కానీ అసలు కోన రఘుపతికి ఎంటి సంబంధం అనే చర్చ కూడా జరుగుతోంది. కోన రఘుపతి కలిసినట్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పీఆర్ టీం ఫోటో రిలీజ్ చేసింది కాబట్టి బయటకు తెలిసింది.. లేకపోతే తెలిసేది కాదు.

కానీ ఒక్క కోన రఘుపతి మాత్రమే కాదని… పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు .. ఇతర కీలక నేతలు బీజేపీ పెద్దల్ని కలిసి వెళ్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ .. ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్లుగా మీడియాకు కూడా తెలియదు. కానీ ఆయన తరచూ ఢిల్లీకి వస్తున్నారని ఓ స్టార్ హోటల్లో బస చేసి కలవాల్సిన వారిని కలిసి వెళ్తున్నారని చెబుతున్నారు. ఇది వైసీపీలో బహిరంగ రహస్యం అయింది.కానీ ఎవరూ నోరు మెదపడం లేదు. మరికొంత మంది కూడా బీజేపీ నేతలో రెగ్యులర్ టచ్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు.

ఈ అంశంపై వైసీపీ హైకమాండ్ .. దృష్టి సారించిందో లేదో కానీ.. బయట స్పెక్యులేషన్ పెరిగిపోవడానికి కారణం అవుతోంది. గతంలో తమిళనాడులో బీజేపీ చేసిన రాజకీయాలు గుర్తున్న వారికి.. వైసీపీ హైకమాండ్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని సూచనలు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ అనుమతి లేకుండా.. ఎవరూ బీజేపీ పెద్దల్ని కలవడానికి లేదని.. ఏదైనా అవసరం మేరకు కలిస్తే.. పార్టీ ఎంపీలతో పాటే వెళ్లి కలవాలని మొదట్లోనే వైసీపీ హైకమాండ్ నిర్దేశించింది. కానీ ఇప్పుడు దాన్ని ఎవరూ పట్టించుకుంటున్నట్లుగా లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close