జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందేనన్న హైకోర్టు..!

ప్రభుత్వ జీవోలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచారని హైకోర్టు ఆదేశించింది. అయితే జీవోలను ఆఫ్‌లైన్‌లో మాత్రం ఉంచాలని… రిజిస్టర్లలో మాన్యువల్ పద్దతికి పోయిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కావు ఇవి.. తెలంగాణ సర్కార్ కు అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు. వాసాలమర్రి గ్రామంలో ఇటీవల దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా గ్రామంలో ఉన్న 76 కుటుంబాలకు పథకం వర్తిస్తుందని ప్రకటించి.. తర్వాతి రోజు నిధులు విడుదల చేశారు. అయితే పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయకుండానే ప్రజాధనం చెల్లిస్తున్నారని వాచ్‌ వాయిస్‌ ఆఫ్ పీపుల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది.

దీనిపై జరిగి న విచారణలో… పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయలేదని పిటిషన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిబంధనలు ఖరారు చేశామని.. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ అమలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ విషయం ఎందుకు పిటిషన్‌లో పేర్కొనలేదని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది.కానీ నిబంధనలు ఖరారు చేసినట్లుగా ఎలాంటి ఆదేశాలు అధికారికంగా ఇవ్వలేదని… జీవోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏమిటని .. వాటిని ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంచారని ఆదేశించింది.

తెలంగాణ అడ్వకేట్ జనరల్ వివరణను నమోదు చేసుకుని పిటిషన్‌పై విచారణ ముగించింది. తెలంగాణ సర్కార్ మరో రోజులో దళిత బంధుకు సంబంధించిన విధి విధానాల జీవోను వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉంది. అయితే ఏపీ సర్కార్ ఆఫ్ లైన్ జీవోలపై ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేస్తే.. పరిస్థితేమిటన్న చర్చ సహజంగానే తెలంగాణ హైకోర్టు తీర్పుతో వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close